2019లో బీజేపీదే అధికారం: నాగం | Sakshi
Sakshi News home page

2019లో బీజేపీదే అధికారం: నాగం

Published Tue, May 30 2017 1:35 AM

2019లో బీజేపీదే అధికారం: నాగం - Sakshi

వికారాబాద్‌ అర్బన్‌: రాష్ట్రంలో 2019లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయ మని ఆ పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యు డు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమ వారం ఆయన వికారాబాద్‌లో ‘గడప గడపకు బీజేపీ, ఇంటింటికీ మోదీ పథ కాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

దేశంలోని 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, మోదీ నాయ కత్వంలో 2019 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పాలమూరు ఎత్తి పోతల కోసం పంపుసెట్ల కొనుగోలులో అవినీతి జరిగిందన్నారు. రూ.60 కోట్ల విలువ చేసే సామగ్రిని రూ.90 కోట్లకు, రూ.160 కోట్ల విలువచేసే సామగ్రికి రూ.250 కోట్లకు పెంచి కాంట్రాక్టర్ల నుంచి 49 శాతం కమీషన్లు తీసుకున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టులో సుమారు రూ.614 కోట్ల అవినీతి జరిగిందన్నారు.
 

Advertisement
Advertisement