Sakshi News home page

సుజనా చౌదరికి వారెంట్ జారీ చేసిన కోర్టు

Published Thu, Apr 7 2016 5:37 PM

సుజనా చౌదరికి వారెంట్ జారీ చేసిన కోర్టు - Sakshi

హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బుధవారం నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. ఆయన వరుసగా మూడు సార్లు కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. సుజనా సంస్థల అధినేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి రూ.106 కోట్లు తమకు ఎగవేశారని ఆరోపిస్తూ... మారిషస్ బ్యాంక్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement