* 21 కోట్ల మందికి హై-బీపీ
* ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో 30 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో చనిపోతున్న వారిలో 53 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతోనే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఆందోళన వ్యక్తంచేశాయి. అందులో హృదయ సంబంధ వ్యాధులతో చనిపోతున్న వారు 29 శాతం ఉన్నారంది. ‘భారత్లో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలన’పై కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇటీవల ఢిల్లీలో కీలక సదస్సు నిర్వహించాయి.
ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్తివారీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ టి.గంగాధర్ పాల్గొన్నారు.దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలనకు సంబంధించి మార్గదర్శకాలపై సదస్సులో నివేదిక విడుదల చేశారు. మధుమేహ (షుగర్) వ్యాధి ద్వారానే దీర్ఘకాలిక వ్యాధులు మరింత ప్రబలుతున్నాయని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2025 నాటికి దేశంలో 21.30 కోట్ల మంది హై-బీపీ, సుమారు 7కోట్ల మంది షుగర్ రోగులు ఉంటారని తెలిపింది.
షుగర్, హై-బీపీ, గుండె పోట్ల కారణంగా విదేశాలతో పోలిస్తే దేశంలో ఐదు పదేళ్ల ముందే చనిపోతున్నారంది. చిన్న వయసులో షుగర్, గుండెపోటు రావడానికి ప్రధాన కారణం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోకపోవడం, ఆహారపుటలవాట్లు, పొగ తాగడమేనని తేల్చింది.
గ్రామస్థాయి వరకు వెల్నెస్ కేంద్రాలు...
ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలు... ఆరోగ్యంపై అవగాహన, దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించడం, వ్యాధులకు గురైన వారికి అవసరమైన చికిత్స చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ప్రజలు రోగాల బారిన పడకుండా చూసేలా గ్రామస్థాయి వరకు ‘వెల్నెస్ కేంద్రాల’ను నెలకొల్పాలని సూచించింది. కాగా, తమిళనాడులో ప్రస్తుతం ఆదర్శవంతమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని, దాన్ని అమలు చేస్తే బాగుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై కసరత్తు చేసి ఆదర్శవంతమైన ఆరోగ్య విధానాన్ని రూపొం దిస్తామని ఆయన తెలిపారు.
2025 నాటికి 7 కోట్ల మందికి షుగర్
Published Tue, Jun 28 2016 1:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement