ఏపీఏటీ కేసులపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ట్రిబ్యునల్లో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న తెలంగాణకు చెందిన కేసులను ఏ చట్టం కింద హైకోర్టుకు బదలాయిస్తారని ప్రశ్నించింది. పరిపాలన ట్రిబ్యునల్ చట్టం కింద హైకోర్టు నుంచి ట్రిబ్యునల్కు కేసులను బదలాయించవచ్చని, అయితే ట్రిబ్యునల్ నుంచి కేసులను హైకోర్టుకు ఎలా.. ఏ చట్టం కింద బదలాయిస్తారో వివరించాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను కొట్టేయాలని కోరుతూ న్యాయవాదులు పీవీ కృష్ణయ్య, బి.కిరణ్కుమార్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కిరణ్కుమార్ తరఫు న్యాయవాది లక్ష్మీ నరసింహ వాదనలు వినిపిస్తూ, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ట్రిబ్యునళ్లను కార్యనిర్వాహక ఉత్తర్వులతో రద్దు చేయడం సాధ్యం కాదని, చట్టం తీసుకురాకుండా ఏపీఏటీ నుంచి తెలంగాణను తప్పించడం సరికాదన్నారు. పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థలు ఉభయ రాష్ట్రాలకు సేవలందించాల్సి ఉందన్నారు.
కేంద్ర నోటిఫికేషన్తో ఏపీఏటీలోని కేసుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పీవీ కృష్ణయ్య వివరించారు. నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, అసలు ఈ వ్యాజ్యాలు దాఖలుకు పిటిషనర్లకు అర్హతలేదని, వారేమీ బాధితులు కాదని తెలిపా రు. 2 రాష్ట్రాల సర్వీసు వివాదాలను హైకోర్టు పరిష్కరించవచ్చన్నారు. ట్రిబ్యునల్ రద్దుకు అవకాశముందని, ఈ విషయమై మద్రాసు హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు. అయితే ఆ తీర్పు వివరాలను తమ ముందుంచాలని ఏజీకి స్పష్టం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
ఏ చట్టం కింద బదలాయిస్తారు?
Published Fri, Sep 23 2016 6:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement