⇒ నైజీరియన్ను పట్టుకోవడానికి సీసీఎస్ పోలీసుల వల
⇒ పోలీసులపై దాడికి తెగబడిన నైజీరియన్లు
⇒ చాకచక్యంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: తన వద్ద ఉన్న కోట్ల డాలర్లతో వ్యాపారం చేద్దామంటూ నిజామాబాద్కు చెందిన వ్యాపారితో యువతిలా చాటింగ్ చేసి.. రూ.లక్షల్లో చీటింగ్ చేసిన ముఠా గుట్టును హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ అధికారులు రట్టు చేశారు. ఢిల్లీలో ఈ గ్యాంగ్ సూత్రధారిగా ఉన్న నైజీరియన్ను పట్టుకునే యత్నంలో సోమవారం భారీ ఛేజింగ్ జరిగింది. స్థానికంగా ఉన్న మరికొందరు నైజీరియన్లు పోలీసులపై దాడికి యత్నించగా.. అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఫేస్బుక్లో పరిచయమై: నిజామాబాద్కి చెందిన వ్యాపారి సాయిప్రసాద్ వ్యాపారాలు చేస్తున్నారు. అతడి ఫేస్బుక్ ఖాతా ద్వారా విదేశీ యువతిగా నైజీరియన్లు పరిచయమయ్యారు. కొన్ని రోజులు చాటింగ్ చేసిన నేరగాళ్లు ఆపై తానో వ్యాపారినని, అమెరికా, లం డన్లో బిజినెస్లు చేస్తుంటానని నమ్మబలి కారు. అనివార్య కారణాల నేపథ్యంలో తన వద్ద ఉన్న భారీ మొత్తం భారత్కు పంపిస్తామని, ఆ మొత్తం వెచ్చించి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, వచ్చిన లాభంలో తనకు సగం వాటా ఇవ్వాలని ‘బంపర్ ఆఫర్’ ఇచ్చారు. వీరి వల్లో పడిన వ్యాపారి నుంచి వివిధ రకాల పేర్లు చెప్పి భారీగా డబ్బు దండుకోవడం మొదలెట్టారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఢిల్లీ కేంద్రంగా ఈ మోసం జరిగినట్లు గుర్తించింది.
డెకాయ్ ఆపరేషన్తో..
మోసగాళ్లు ఇప్పటికీ సాయిప్రసాద్తో సంప్రదింపులు జరుపుతుండటంతో పోలీసులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించారు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. సాయిప్రసాద్ ద్వారానే నేరగాళ్లను సంప్రదిం చి, రూ.25 లక్షలు తీసుకువచ్చామని చెప్పిం చింది. ఈ నగదు తీసుకోవడానికి ప్రధాన నిందితుడు వస్తాడని, అప్పుడు అతడిని పట్టుకోవాలని ప్లాన్ చేసింది. తొలుత సూత్రధారి రాకుండా అతడి అనుచరుడైన మరో నైజీరియన్ను పంపాడు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అనుచరుడి ద్వారానే ఫోన్ చేయించి, నగదు అందినట్లు చెప్పించారు.
సూత్రధారి ఈ మాటలు నమ్మి డబ్బు తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్న చోటుకు వచ్చాడు. పోలీసులను పసిగట్టి∙పారిపోయే యత్నం చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నా రు. ఆ ప్రాంతంలోనే ఉన్న మరికొందరు నైజీ రియన్లు పోలీసులపై దాడి చేసి, అదుపులో ఉన్న వారిని విడిపించేందుకు యత్నించారు. పోలీసులకు స్వల్ప గాయాలైనా నేరగాళ్లను విడిచిపెట్టలేదు. చాకచక్యంగా వ్యవహరించి న హైదరాబాద్ బృందం స్థానిక పోలీసుల సాయంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిం ది. వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్పై నగరానికి తీసుకురానుంది.
ఢిల్లీ వీధుల్లో ఛేజింగ్..!
Published Tue, Feb 28 2017 12:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement