బోర్డులే కానీ.. బతుకులు మార్చలేదు:దేవీప్రసాద్ | Sakshi
Sakshi News home page

బోర్డులే కానీ.. బతుకులు మార్చలేదు:దేవీప్రసాద్

Published Mon, Apr 21 2014 2:46 AM

బోర్డులే కానీ.. బతుకులు మార్చలేదు:దేవీప్రసాద్

రాష్ట్ర విభజనపై టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ వ్యాఖ్య

వికారాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా స్వయం ప్రతిపత్తి లేకుండా లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల బోర్డులు మార్చింది కానీ తెలంగాణ ప్రాంత ఉద్యోగుల బతుకులు మార్చలేదని టీఎన్జీవో అధ్యక్షుడు జి.దేవీప్రసాద్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఆయన మాట్లాడారు. ఆప్షన్ల పేరిట 50వేల మంది ఆంధ్రా ఉద్యోగులను ఇక్కడే ఉంచే ప్రయత్నం జరుగుతోందని, స్థానికత ప్రామాణికంగా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియామకమైన సీమాంధ్ర ఉద్యోగులను వారి వారి ప్రాంతాలకు పంపించాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement