హైదరాబాద్ : శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం సమాధానం చెప్పలేక ఎదురు దాడికి యత్నించింది. సభలో చర్చను పూర్తిగా పక్కదోవ పట్టించి, ప్రతిపక్ష సభ్యులను బెదిరించే ధోరణికి దిగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో జరిగిన కుంభకోణాలను వైఎస్ జగన్ సభలో ప్రస్తావించారు. దీంతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష సభ్యులపై పరుష పదాలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. అంతేకాకుండా '35 ఏళ్లుగా నీతి నిజాయితీలతో బతుకుతున్నా. నన్ను ఎవరూ ఏం చేయలేకపోయారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన ఇస్తున్నాం. అసత్య ఆరోపణలు, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాధారాలు ఉండాలి. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటాం. లేకుంటే ఆరోపణలు చేసినవారిపై చర్చలు తీసుకోవాలి. మంత్రులపై ఆరోపణలు చేశారు. నిరూపించమంటే పారిపోయారు. అవినీతిపై నిరూపించేందుకు సిద్ధమా లేకుంటే క్షమపణలు చెప్పండి. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మీ ప్రతిపక్ష నేతను తప్పించి, ఆయన స్థానంలో ఎవరైనా ప్రతిపక్ష నేత కండి. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసురుతున్నా. అంతేకాదు అవినీతికి పాల్పడివారిపై చండశాసనుడిగా ఉంటా' అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన సవాల్ పై వైఎస్ జగన్ స్పందన పూర్తి కాకముందే మరోసారి మైక్ కట్ అయింది.
కాగా చంద్రబాబు సర్కార్పై 20 అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అయితే కేవలం 2 ఆరోపణలపైనే విచారణ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. దమ్ము, ధైర్యముంటే 20 ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. రాజధాని భూ దందాపై సీబీఐ విచారణ అడిగాం. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆరోపణలు చేస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
నన్ను ఎవరూ ఏం చేయలేకపోయారు: బాబు
Published Mon, Mar 14 2016 5:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement