- శాసనసభ హక్కుల కమిటీ నిర్ణయం
- హోదాకోసం నినదించిన 15మంది ఎమ్మెల్యేలు
- 25, 26 తేదీల్లో హైదరాబాద్లో హాజరు కావాలని ఆదేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నినదించిన 15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరాలని ప్రివిలేజ్ (హక్కుల) కమిటీ నిర్ణయించింది. కమిటీ సమావేశం విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ) కె. రామకృష్ణ, బీసీ జనార్దనరెడ్డి, తెనాలి శ్రావణ్కుమార్, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. తొలుత కమిటీ ఇటీవల హైదరాబాద్లో సమావేశమైనపుడు చర్చించిన అంశాలను ఆమోదించారు. సమావేశంలో గత నెల 8 నుంచి 10 వర కూ జరిగిన శాసనసభ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సుమారు 15 మంది వైఎస్సార్సీీవ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని గుర్తించారు. వారిని కమిటీ ముందుకు పిలవాలని నిర్ణయించారు. 15 మందికి నోటీసులు జారీ చేసి ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్లో జరిగే కమిటీ సమావేశానికి హాజరు కావాలని కోరనున్నారు.
పామర్రు ఎంపీడీవోపై ఆగ్రహం
కృష్ణా జిల్లా పామర్రు ఎంపీడీవో రామనాథంపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీకి లేఖ రూపంలో ఇచ్చిన వివరణలో పొందుపరిచిన అంశాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే తీరుగా వ్యవహరిస్తే కమిటీ ముందు హైదరాబాద్లో హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్థానిక ఎంపీడీవో రామనాథం ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, స్థానిక టీడీపీ నియోజకవర ఇన్చార్జి వర్ల రామయ్య ప్రోద్బలంతో అలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీన్ని కమిటీ విచారించి ఎంపీడీవో వివరణ కోరింది. ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా ఎంపీడీవో తన వివరణలో పేర్కొన్నారు. దీంతో క మిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి... ‘వివరణ మీపై అధికారి ద్వారా పంపించాలి. మీరు నేరుగా ఎలా పంపుతార’ని నిలదీసింది. కమిటీ ముందు వ్యవహరించే పద్ధతి ఇది కాదని, ప్రజాప్రతినిధి ఏ పార్టీకి చెందిన వారైనా గౌరవించాల్సిందేనని సూచించింది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
Published Sat, Oct 15 2016 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement