'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే' | Sakshi
Sakshi News home page

'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే'

Published Wed, Jan 18 2017 8:41 AM

Ntr family members tributes to NTR over 21st Death Anniversary

హైదరాబాద్ : తాత గురించి ఎంత చెప్పినా తక్కువేనని హీరో జూ.ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ తాత అడుగుజాడల్లో నడుస్తామన్నారు. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.

ఎన్టీఆర్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని మాజీ రాజ్యసభసభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. నివాళులర్పించిన వారిలో హీరో కల్యాణ్ రామ్‌, ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement