సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డుల కోసం కొత్త దరఖాస్తుల నమోదు బాధ్యత మీ సేవ కేంద్రాలకు అప్పగించడంతో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక నేరుగా సర్కిల్ కార్యాలయాల్లో కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ పూర్తిగా నిలిపివేసింది. మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్ సర్వర్ మొరాయిస్తుండటంతో పాటు పూర్తి స్థాయి డేటా అప్డేట్ లేక దరఖాస్తుల అప్లోడ్ పెండింగ్లో పడిపోతున్నాయని పేదలు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసిన తెల్లరేషన్ కార్డులను రద్దు చేసింది.
వాటి స్థానంలో కొత్తగా దరఖాస్తులు స్వీకరించి ఆహార భద్రత కార్డులను మంజూరు చేసింది. గతేడాది కాలంగా పౌరసరఫరాల శాఖ అధికారులు కార్డులు లేని పేద కుటుంబాల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తూ అధార్ కార్డులను పరిగణలోకి తీసుకొని అర్హులకు ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తూ వస్తున్నారు. పౌరసరఫరాల శాఖ సర్కిల్ కార్యాలయాల్లో నేరుగా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు, మంజూరైన కార్డుల్లో చేర్పులు, మార్పులు, సవరణలకు వెసులుబాటు ఉండటంతో ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. తాజాగా ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచి కొత్త దరఖాస్తులు, కార్డుల్లో చేర్పులు, మార్పులు, సవరణల కోసం ఆన్లైన్ ద్వారా నమోదు చేసే బాధ్యత మీ సేవ కు అప్పగించింది.
కనిపించని డేటా....
మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ సర్వర్ మొరాయించడం కొత్త దరఖాస్తుల నమోదుకు ప్రధాన సమస్యగా తయారైంది. మరోవైపు ఆన్లైన్లో ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అప్డేట్ లేకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. మీసేవ ద్వారా ఆన్లైన్లో కొత్త దరఖాస్తులు నమోదు కోసం కొన్ని అప్షన్స్కు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అప్డేట్ లేకుండా పోయింది.
దరఖాస్తుదారుడి చిరునామాను బట్టి ఆ ప్రాంతానికి ఏ షాపు నంబర్ వర్తిస్తుందో స్పష్టంగా పొందుపర్చలేదు. లబ్ధిదారుడే తెలుసుకొని వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్కు సబంధించిన గ్యాస్ ఏజెన్సీ పేర్లు ఆప్షన్లో కనిపించక పోవడంతో అప్లోడ్ సమస్య తలెత్తుతోంది.
బాదుడు...
మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొత్త రేషన్ కార్డుల నమోదు కోసం పేదలను బాదేస్తున్నారు. వాస్తవంగా నిబంధనల ప్రకారం కొత్త కార్డుల కోసం దరఖాస్తును నమోదు చేసేందుకు కేవలం రూ.35 లు ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ దరఖాస్తుదారుల అమాయకత్వాన్ని బట్టి కనీసం రూ.75 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
కొత్తగా ఆహార భద్రత కార్డుల మంజూరు కోసం మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, అడ్రస్ప్రూఫ్, సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన కుటుంబాలకు కార్డులను మంజూరు చేస్తాం. కార్డుల కోసం మధ్య దళారులను ఆశ్ర యించవద్దు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని సర్కిల్ కార్యాలయంలో సమర్పిస్తే సరిపోతుంది. అర్హులకు తప్పకుండా కార్డులు మంజూరు చేస్తాం. - రాథోడ్, డీఎస్ఓ, హైదరాబాద్
‘సర్వర్ డౌన్’ తిప్పలు!
Published Wed, Feb 17 2016 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement