సాక్షి, హైదరాబాద్: అక్టోబర్లో నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరు కావాలనుకునే వారు ఈ నెల 26వ తేదీ వరకు తత్కాల్లో ఫీజు చెల్లించవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది.
పరీక్ష ఫీజుకు అదనంగా తత్కాల్ కింద ఎస్సెస్సీకి రూ. 500, ఇంటర్కు రూ. 1,000 చెల్లించాలని సూచించింది. గతంలో ఇచ్చిన తత్కాల్ గడువు ఈ నెల 21తో ముగిసిపోయిందని, అయితే ఆ గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.