► వాహన అద్దాల ‘రంగు’ వదలాల్సిందే!
► వాటి లోపలి భాగం స్పష్టంగా కనిపించాల్సిందే
► సోమవారం నుంచి ఉల్లంఘనులకు రూ.500 వడ్డన
► మరోసారి ‘ఆపరేషన్ బ్లాక్ఫిల్మ్’ :జేసీపీ రవీందర్
సాక్షి, సిటీబ్యూరో: ‘కార్లు తదితర వాహనాల అద్దాలపై ఉంటున్న రంగు ఫిల్మ్లు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించండి. వాటి లోపలి భాగాలు స్పష్టంగా బయటకు కనిపించేలా చర్యలు తీసుకోండి’ అంటూ 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మరోసారి అమలులోకి తీసుకురానున్నారు. ఆ ఏడాది తొలిదశ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు వాహనచోదకుల్లో అవగాహన తీసుకువచ్చారు. ఫలితంగా సిటీలో దాదాపు 95 శాతం వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్ఫిల్మ్ తొలగింది. అయితే ఇంకా మిగిలిన వాహనాలు ఇప్పటికీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి.రవీందర్ బుధవారం వెల్లడించారు.
వీరిపై సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం, ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండని అర్ధరాత్రి వేళ వాహనాలతో బయటకు రావడం చేస్తున్నట్లు పరిగణిస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు సైతం బ్లాక్ఫిల్మ్తో కూడి ఉంటున్నట్లు అధ్యయనంలో తేల్చామని రవీందర్ తెలిపారు. వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా ఉల్లంఘనలపై 44,079 కేసులు నమోదు చేశారన్నారు. సోమవారం నుంచి చేపట్టబోయే స్పెషల్ డ్రైవ్లో చిక్కిన వాహనాలకు రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఓ ఉల్లంఘనపై జరిమానా విధిస్తే... మళ్ళీ 24 గంటలు దాటే వరకు అదే ఉల్లంఘనపై, అదే వాహనానికి మరోసారి జరిమానా విధించే ఆస్కారం ఉండదు. అయితే బ్లాక్ఫిల్మ్ కేసుల్లో ఒక రోజులో ఎన్ని చోట్ల వాహనం చిక్కితే అన్ని చలాన్లు జారీ చేస్తామని రవీందర్ స్పష్టం చేశారు.
లైసెన్స్ లేని చోదకులకు జైలు...
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ... ట్రాఫిక్ పోలీసులకు నాలుగో సారి చిక్కిన వాహన చోదకులకు సికింద్రాబాద్ న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించిందని జేసీపీ రవీందర్ బుధవారం తెలిపారు. దీంతో పాటు వీరికి రూ.వెయ్యి జరిమానా సైతం పడిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధం, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు లైసెన్స్ లేని వాహనచోదకులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు చేపట్టే స్పెషల్డ్రైవ్స్లో చిక్కిన ఉల్లంఘనుల నుంచి వెహికిల్ స్వాధీనం చేసుకుంటామని, జరిమానా చెల్లించడంతో పాటు ఆర్టీఏ అధికారుల నుంచి లైసెన్స్/లెర్నింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే వాహనాన్ని విడిచిపెడతామని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనులకు కౌన్సిలింగ్ ఇచ్చి న్యాయస్థానాల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
రోజులో ఎన్నిసార్లు చిక్కితే అన్ని చలాన్లు!
Published Thu, Jul 6 2017 8:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement