నేడు సభ బహిష్కరణ?
- ఏకతాటిపైకి కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఎం
- డోలాయమానంలో బీజేపీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సభా స్ఫూర్తిని, గౌరవా న్ని, దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరికి నిరసనగా గురువారం శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఎం సభను ఒకరోజుపాటు బహిష్కరిం చనున్నాయి. బుధవారం సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవ సరంగా సమావేశమైంది.
ప్రతిపక్ష సభ్యులకు సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వివిధ అంశాలపై పార్టీ వైఖరిని చెప్పే కనీసం సంప్రదాయాన్ని కూడా పాటించడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘సమ స్యపై సంపూర్ణ చర్చకు ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వడంలేదు. అంశాలపై పార్టీల వైఖరిని సభలో చెప్పడానికి అవకాశం ఇవ్వడంలేదు. సభలో నిరసన చెప్పే ప్రజాస్వామిక సంప్రదాయా న్ని స్పీకర్ పట్టించుకోవడంలేదు. ముఖ్య మంత్రి, మంత్రులు వెకిలిగా మాట్లాడుతుం టే వారించాల్సిందిపోయి నవ్వుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభను ఒకరోజు బహిష్కరించా లని నిర్ణయించాం’’ అని కాంగ్రెస్ సభ్యుడొ కరు వెల్లడించారు. శాసనసభ స్ఫూర్తిని, గౌర వాన్ని కాపాడలేని స్పీకరు తీరుపై ప్రాథమి కంగా నిరసన వ్యక్తం చేయడానికి ఈ నిర్ణ యం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు.
కలిసిరానున్న టీటీడీపీ, సీపీఎం
కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం తీసుకున్న బహిష్కరణ నిర్ణయానికి టీటీడీపీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. స్పీకర్ తీరుకు నిరసనగా సభను బహిష్కరించాలని టీటీడీపీ నిర్ణయించింది. బీజేపీతో ప్రతిపక్షపార్టీలు చర్చలు జరుపుతున్నాయి. స్పీకర్ తీరుపై అసంతృప్తిని వెలిబుచ్చిన బీజేపీ సభ్యులు బహిష్కరణపై మాత్రం నిర్ణయాన్ని తీసుకోలేదు. బహిష్కరణ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలా, వద్దా అనే దానిపై పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ వైఖరిపై గురువారం ఉదయానికి స్పష్టత రానుంది.
స్పీకర్పై ప్రతిపక్షాల ఆగ్రహం
Published Thu, Dec 29 2016 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement