18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం: కేసీఆర్
- పాలమూరు ఎత్తిపోతల కట్టితీరుతాం
- ఖరీఫ్ నాటికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
- ముఖ్యమంత్రిని కలసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో వలసల జిల్లాగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతోపాటు కొత్త, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరందించడం ద్వారా మహబూబ్నగర్ పాత జిల్లాను తూర్పుగోదావరి జిల్లాకు ధీటు గా తయారు చేస్తామని చెప్పారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్కు చెందిన ఆ జిల్లా ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మె ల్యేలు డి.కె.అరుణ, చిన్నారెడ్డి, సంపత్, వంశీ చంద్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తదితరులు బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు.
నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు జిల్లాకు చెందిన ఇతర సమస్యలపై చర్చించారు. పాలమూరు జిల్లా కున్న నీటి వనరులు, ప్రాజెక్టుల డిజైన్ తదితర అంశాలను సీఎం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరిం చారు. రాజకీయాలకతీతంగా పాలమూరు జిల్లాను కాపాడటమే తమ అభిమతమని అన్నారు. ‘‘గోదావరిలో 3000, కృష్ణాలో 1200 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటిని సద్విని యోగం చేసుకుంటే చాలు. రెండు రాష్ట్రాల్లో ప్రతీ ఎకరానికి నీరివ్వొచ్చు. పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చెప్పాను.
పాలమూరు జిల్లాకు నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగునీరు అందించాలి. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశాం. ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టినా అపెక్స్ కమిటీ సమావేశంలో వారి అనుమానాలు నివృత్తి చేశాం. పాల మూరు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తవు తాయి. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిలా ్లకు కూడా నీరందుతుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. శ్రీశైలం వద్ద వంద టీఎంసీల లభ్యత ఉంది. అక్కణ్నుంచి ఏడాది పొడవునా నీరు తోడుకోవచ్చు. అందుకే శ్రీశైలం నుంచి పాలమూరు ఇన్టేక్ ప్లాన్ చేశాం. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మా ణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధా న్యమిచ్చింది. తుమ్మిళ్ల, గట్టు లిఫ్టు పనులు త్వరగా పూర్తయ్యే ట్లు చూస్తాం..’’ అని సీఎం చెప్పారు.
గద్వాల–మాచర్ల రైల్వే లైన్ అత్యవసరం
‘‘గద్వాల–మాచర్ల రైల్వే లైన్ పనులు చేపట్టాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తాను. ఈ లైన్ అత్యవసరం. గద్వాలలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారికోసం హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. గద్వాల íపీజీ సెంటర్లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తాం. మహబూబ్నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేస్తాం..’’ అని సీఎం వెల్లడించారు. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కలసి రావాలని నేతలను కోరారు.
తూర్పుగోదావరిలా పాలమూరు
Published Thu, Mar 30 2017 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement