జీహెచ్ఎంసీలో ఉద్యోగుల ఆందోళన బుధవారం తీవ్రరూపం దాల్చింది. ప్రధాన ప్రతిపక్ష యూనియన్ బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో బంద్ పాటించారు. యూనియన్ ప్రతినిధులు ప్రధాన కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని బయటకు పంపించి, అన్ని కార్యాలయాల్లోనూ విద్యుత్ను నిలిపివేయడంతో ఎక్కడి పనులక్కడే స్తంభించిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించినప్పటికీ, ఒంటిగంట నుంచి ఒక్కొక్క కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు పంపించివేశారు. కరెంట్ తీసివేసి లైట్లు ఆపివేశారు. దీంతో నిత్యం రద్దీతో కిటకిటలాడే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం బోసిపోయి కనిపించింది. సర్కిల్, జోనల్కార్యాలయాలనుంచి ప్రధాన కార్యాలయం వద్దకు భారీసంఖ్యలో చేరుకున్న ఉద్యోగులనుద్దేశించి బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్ ప్రసంగించారు. డిమాండ్లు నెరవేరేంతవరకు, సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు వెనక్కు తగ్గేది లేదని పిలుపునిచ్చారు. కాగా టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్కలెక్టర్ల తరపు ప్రతినిధులతో మంగళవారం రాత్రి చర్చలు జరిపిన అడిషనల్ కమిషనర్లు సస్పెండ్ చేసిన ఇద్దరు టాక్స్ ఇన్స్పెక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించడంతోపాటు ఇతరత్రా డిమాండ్లపైనా కమిషనర్ సానుకూలంగా స్పందించినందున సమస్య సమసిపోయిందని ప్రకటించారు. అందుకనుగుణంగా బుధవారం ఉదయం కొందరు టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్కలెక్టర్లు విధులకు కూడా హాజరయ్యారు. జోక్యం చేసుకున్న కొందరు యూనియన్ నేతలు డ్యూటీల్లో ఉన్నవారందరినీ వెనక్కు పిలిపించి, కార్యాలయాలనూ బంద్ చేయించారు.
బదిలీ చేయాల్సిందే: బీఎంఎస్
కమిషనర్ను బదిలీ చేయడమే తమ ఏకైక డిమాండ్ అని, అది నెరవేరేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి వినయ్కపూర్ స్పష్టం చేశారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ , నెలనెలా ఏదో ఒక సమస్యతో కమిషనర్ వద్దకు వెళ్లలేమని, ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలనేదే తమ ఏకైక డిమాండ్ అన్నారు.
ఉద్యోగులపై అదనపు భారం మోపవద్దు: టీజేఏసీ
ఉద్యోగులపై మోయలేని భారాన్ని మోపవద్దని తెలంగాణ మునిసిపల్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య, తెలంగాణ జీహెచ్ఎంఈయూ వర్కింగ్ ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్, ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్ , జేఏసీలోని వివిధ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిపిన వారు ఉద్యోగుల ‘జాబ్చార్ట్’ ప్రకారమే పనులప్పగించాలన్నారు. అర్హులైనవారికి వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై కార్యాచరణను గురువారం ప్రకటించనున్నట్లు సీఐటీయూ ఒక ప్రకటనలో పేర్కొంది.
మేయర్ ప్రకటనతో దుమారం..
ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు మేయర్ పేరిట వెలువడిన సమాచారం దుమారం రేపింది. 9వ తేదీన మృతిచెందిన ఏఎంసీ అశోక్కుమార్ ఆత్మశాంతికోసం బుధవారం జరగాల్సిన స్టాండింగ్కమిటీ తీర్మానాలపై సమీక్షను మేయర్ వాయిదా వేసినట్లు మీడియా ప్రతినిధులకు ఎస్సెమ్మెస్లు వెళ్లాయి. దాంతోపాటే ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు కూడా పేర్కొనడంతో మేయర్, కమిషనర్ మధ్య వార్ జరుగుతోందా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
సమస్యలుంటే పరిష్కరిస్తాం: సోమేశ్కుమార్
ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని జీహెచ్ంఎసీ కమిషనర్ సోమేశ్కుమార్ పునరుద్ఘాటించారు. యూనియన్ నాయకులు చర్చలకు వస్తే మాట్లాడేందుకు అభ్యంతరం లేదని, సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు.
స్తంభించిన జీహెచ్ఎంసీ
Published Wed, Nov 12 2014 11:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement