వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల పనుల్ని టీడీపీ నేతలు దోపిడీకి ఆయుధంగా మలుచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. వందల కోట్ల పుష్కరాల నిధుల దోపిడీకోసం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ పనుల్ని నామినేషన్ విధానంలో కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖలలో దోపిడీ విధానమంతా సీఎం కార్యాలయం ప్రమేయంతోనే జరుగుతోందని ఆరోపించారు.
పరిపాలన అనుమతులు లేకుండానే పనులు చేపట్టి.. ఆ తర్వాత అనుమతులివ్వడంలో ఆంతర్యమేంటన్నారు. రూ.35 కోట్ల విలువైన పనుల్ని ఎలా అనుమతించారో చెప్పాలన్నారు. నిబంధనల ప్రకారం వెళతామన్న అధికారులపై సీఎం కన్నెర్ర చేస్తూ కర్రపెత్తనం చేస్తున్నారని విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు నిధుల విడుదల దగ్గర్నుంచీ టెండర్ల వ్యవహారం, పనుల కేటాయింపుపై విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సాగునీటిశాఖ మంత్రి నివాసముండే ప్రాంతానికి కూతవేటు దూరంలోని అత్యంత ప్రాముఖ్యమైన దుర్గాఘాట్ పనులు ఇంతవరకు ప్రారంభించకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు.
ఆ కమిషన్ చంద్రబాబును విచారించిందా?
గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారార్భాటానికి 30 మంది బలయ్యారని, ఈ దుర్ఘటన జరిగి ఏడాదైనా ప్రజల మదినుంచి తొలగిపోలేదని పార్థసారథి అన్నారు. అసలు తొక్కిసలాటకు బాధ్యుడైన చంద్రబాబును సోమయాజులు కమిషన్ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. కమిషన్ గడువు గతనెల 29నాటికి పూర్తై చంద్రబాబును ప్రశ్నించలేదంటే.. వారిచ్చే నివేదికెలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో 30మందిని బలి తీసుకుంటే, కృష్ణా పుష్కరాలకు 30 గుళ్లు కూల్చేశారన్నారు.
‘పుష్కర’ దోపిడీపై విచారణ జరపాలి
Published Fri, Jul 15 2016 4:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement