కాంగ్రెస్ పార్టీపై పవన్ కల్యాణ్ సెటైర్లు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీపై పవన్ కల్యాణ్ సెటైర్లు

Published Mon, Jul 13 2015 1:33 PM

కాంగ్రెస్ పార్టీపై పవన్ కల్యాణ్ సెటైర్లు - Sakshi

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్..కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ నేతలు గాలికొదిలేశారని, లలిత్ మోదీ వివాదానికే ఆపార్టీ పరిమితమైందని ఆయన తన ట్విటర్ లో వ్యాఖ్యానించారు. 5 కోట్ల మంది సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాంగ్రెస్ నేతలకు పట్టడం లేదా అని పవన్ ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ పార్టీకి లలిత్ మోదీ అంశమే ప్రధానమైనదా అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు ఏం చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్   ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రధానంగా టీడీపీ, బీజేపీ ఎంపీలను పేర్లు పెట్టి మరీ టార్గెట్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement