ప్రశాంతంగా ఘటాల ఊరేగింపు పోటెత్తిన భక్తులు
చార్మినార్ : బోనాల జాతర సందర్భంగా పాతబస్తీలో సోమవారం సాయంత్రం మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు నడుమ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు ముందస్తు ప్రణాళికలు రూపొందించినప్పటికీ... ఈసారి ఊరేగింపు ఆలస్యమైందనే చెప్పాలి. భవిష్యవాణి అనంతరం మాతేశ్వరీ ఘటాల ఊరేగింపునకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం ప్రారంభమైన అక్కన్న, మాదన్నల దేవాలయ ఘటం సాయంత్రం 6.45 గంటలకు చార్మినార్కు చేరుకుంది. 7 గంటలకు ఊరేగింపులోని కొంత భాగాన్ని హిమ్మత్పురా చౌరస్తా వద్ద నిలిపివేశారు. అనంతరం తిరిగి ఊరేగింపు కొనసాగింది. పోలీసులు సూచించిన విధంగా నిర్వాహకులు క్రమశిక్షణతో సహకరించడంతో ఎలాంటి అడ్డంకులు ఏర్పడలేదు. పాతబస్తీలోని అన్ని ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. భక్తులు దారి పొడవునా ఘటాలకు ఘనంగా స్వాగతం పలికారు.
ఊరేగింపు సాగిందిలా.... బోనాల సందర్భంగా సోమవారం ఉదయం అన్ని ప్రధాన దేవాలయాలలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక మీదుగా లాల్దర్వాజా సింహవాహిని ఘటాలతో కలిసింది. అక్కన్న, మాదన్న దేవాలయం, మురాద్ మహల్, గౌలిపురా, సుల్తాన్షాహి, హరిబౌలి ఘటాలు లాల్దర్వాజా మోడ్కు చేరుకున్నాయి. ఈ ఊరేగింపు శాలిబండ, హిమ్మత్పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్హౌజ్ల మీదుగా నయాపూల్ మూసీ నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన మహంకాళి అమ్మవారి ఘటం కోట్ల అలీజా, సర్దార్ మహల్ మీదుగా చార్మినార్ చేరుకొని ప్రధాన ఊరేగింపులో కలిసింది.
ప్రముఖుల స్వాగతం... ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రాజ్, ప్రధాన కార్యదర్శి ప్యారసాని వెంకటేష్ల ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నాయకులు డాక్టర్ భగవంత్ రావు తదితరులు ఘటాలకు స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు... మీరాలంమండి దేవాలయ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, బేలా ముత్యాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు సదానంద్ యాదవ్లు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సుల్తాన్షాహి జగదాంబ దేవాలయ కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, లాల్దర్వాజ సింహవాహిని దేవాలయంలో మానిక్ప్రభు గౌడ్, తిరుపతి నర్సింగ్రావు, అక్కన్న, మాదన్నల దేవాలయ కమిటీఅధ్యక్షులు జి.నిరంజన్ తదితరులు ఘటాలకుపూజలు చే శారు.
అపూర్వ ఘట్టం
Published Mon, Aug 10 2015 11:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement