డబ్బులు లేని ఏటీఎంకు పూజలు | Sakshi
Sakshi News home page

డబ్బులు లేని ఏటీఎంకు పూజలు

Published Tue, Nov 22 2016 12:26 PM

డబ్బులు లేని ఏటీఎంకు పూజలు - Sakshi

హైదరాబాద్: ఏటీఎం లలో డబ్బులు రాకపోవడంతో పని చేయని ఏటీఎం లకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని కొత్తపేటలో మంగళవారం ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్ద ఎల్‌బీ నగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వినూత్నప్రదర్శన నిర్వహించారు.

ఏటీఎంలలో డబ్బులు రాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, వెంటనే కేంద్రానికి కనువిప్పు కలగాలని కోరుతూ పూజారులతో ఏటీఎంలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి పూజలు చేశారు. 
 

Advertisement
Advertisement