- పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశాల్లేవు
- కొనసాగనున్న తెలంగాణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం మహానాడును పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును మరోసారి ఎన్నుకోవటం వరకే పరిమితం చేయనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశాలు లేవని సమాచారం. వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్రం రెండుగా విడిపోనుంది. దీంతో రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల ను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఈ మహానాడులో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను ఎన్నుకోకుండా పార్టీ అధ్యక్షుడి గా చంద్రబాబును మాత్రమే ఎన్నుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి సాధారణ ఎన్నికల సమయంలో ఒక కమిటీని నియమించారు. ప్రస్తుతానికి ఆ కమిటీనే యధాతథంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారంగా ఉంది.
బాబుతో బాలకృష్ణ భేటీ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కింగ్షుక్ నాగ్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాల కొండయ్య, పూనంమాలకొండయ్య తదితరులు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నటి జమున, నటుడు జయప్రకాశ్రెడ్డి కూడా బాబుకు అభినందనలు తెలిపారు.
మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కువైట్ ప్రవాసాంధ్ర టీడీపీ గౌరవాధ్యక్షుడు వెంకట్, అధ్యక్షుడు సుబ్బారాయుడు నాయుడు, ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు గోపరాజు వెంకటేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపినవారిలో ఉన్నారు. ఇలావుండగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో పార్టీ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కేక్ కట్ చేశారు. గుంటూరు రైల్పేటకు చెందిన ఒక మహిళ సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి తన వంతు విరాళంగా పదివేలు చంద్రబాబుకు పోస్టు ద్వారా పంపారని మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీరాజ్ చాంబర్ రాష్ట్ర కమిటీ సమావే శాలు ఈ నెల 25, 26 తేదీల్లో తిరుపతిలో జరుగుతాయని టీడీపీ అధికార ప్రతినిధి, చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ వేరొక ప్రకటనలో తెలిపారు.
టీడీపీలో చేరిన పిఠాపురం ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వర్మకు బాబు టీడీపీ టిక్కెట్టు నిరాకరించటంతో ఆయన రెబల్గా పోటీచేసి గెలుపొందారు. పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అధ్యక్షుడి ఎన్నికకే మహానాడు పరిమితం!
Published Fri, May 23 2014 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement