హైదరాబాద్ లో మోదీకి ఘనస్వాగతం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో మోదీకి ఘనస్వాగతం

Published Sun, Aug 7 2016 2:49 PM

హైదరాబాద్ లో మోదీకి ఘనస్వాగతం - Sakshi

హైదరాబాద్: ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీకి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

మోదీ బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మెదక్ జిల్లా గజ్వేల్కు బయల్దేరి వెళ్లారు. ప్రధాని వెంట గవర్నర్, కేసీఆర్, వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ వెళ్లారు. కోమటిబండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్కు తిరిగివస్తారు.

ఎన్నికల సమయంలో తెలంగాణలో పలు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్న మోదీ.. ప్రధాని అయ్యాక రెండేళ్ల తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement