పేకాట శిబిరంపై దాడి : 12 మంది అరెస్టు | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపై దాడి : 12 మంది అరెస్టు

Published Tue, Apr 5 2016 7:33 PM

పేకాట శిబిరంపై దాడి : 12 మంది అరెస్టు - Sakshi

హైదరాబాద్: నగరంలోని ఓ పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. మూసాపేట్ జనతానగర్‌లోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 12 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 సెల్‌ఫోన్లు, రూ.81,650 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement