Sakshi News home page

మా జోలికి వస్తే ఊరుకోం: సీఎం కేసీఆర్

Published Wed, May 4 2016 5:43 PM

మా జోలికి వస్తే ఊరుకోం: సీఎం కేసీఆర్ - Sakshi

హైదరాబాద్ : తాము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో గొడవ పడాలనుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ మా జోలికి వస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లో కేసీఆర్ సమక్షంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.... పాలమూరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయమే అని ఆయన గుర్తు చేశారు. మా వాటా ప్రకారం నీళ్లు వాడుకుంటామని కేసీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement