9 వైస్ చాన్స్లర్ పోస్టుల కోసం 450కి పైగా దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్(వీసీ) పోస్టుల కోసం పోటీ తీవ్రమైంది. వైస్ చాన్స్లర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే ప్రొఫెసర్ల సీనియారిటీ అర్హతను 10 నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో ఆశావహులు పెరిగారు. ప్రొఫెసర్లే కాకుండా ఏదేని పరిశోధనా సంస్థలో ఐదేళ్లు పనిచేసి ఉన్నా, పరిపాలనా రంగంలో పనిచేసి, ఐదేళ్లపాటు పాలన అనుభవం కలిగి ఉన్నావారు కూడా అర్హులేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని 9 వర్సిటీలు- ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల కోసం ఇప్పటివరకు ఆఫ్లైన్ 53 మంది, ఆన్లైన్లో 400 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీ వరకు ఉంది. దీంతో మరో 200కుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఉన్నత విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
వీసీలుగా ఐఏఎస్, ఐపీఎస్లకు అవకాశం?
వైస్చాన్స్లర్లుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొన్ని విశ్వ విద్యాలయాలకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వైస్చాన్స్లర్లుగా నియమించే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వచ్చే దరఖాస్తులను ప్రొసీజర్ ప్రకారం ఒక్కో యూనివర్సిటీకి వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలను బ ట్టి ముగ్గురి పేర్లను సర్చ్ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆ సర్చ్ కమిటీలో యూజీసీ నామినీ, యూనివర్సిటీ నామినీతోపాటు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. దీంతో దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వం సూచించే పేరును కూడా ముగ్గురి పేర్లలో ఒకరిగా చేర్చే అవకాశముంది. ఇందులో ప్రభుత్వం తరఫున రిటైర్డ్, పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు రిటైర్డ్ లేదా ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ ఐపీఎస్ అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్న నేపథ్యంలో ఆ తరువాతే ఏయే యూనివర్సిటీకి ఎవరిని వైస్ చాన్స్లర్గా నియమిస్తారన్నది తేలనుంది. మొత్తానికి జనవరి నెలాఖరుకల్లా వీసీలను నియమించే అవకాశముంది.
‘చాన్స్’ కోసం ప్రొఫెసర్ల పోటీ
Published Tue, Jan 5 2016 1:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement