ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్
సాక్షి, హైదరాబాద్: నవ భారత నిర్మాత పండిట్ నెహ్రూ అయితే, నవీన భారత నిర్మాత మన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో, పెంగ్విన్ పబ్లికేషన్స్ ప్రచురణ సంస్థల నేతృత్వంలో హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ‘నరసింహుడు’, ‘హాఫ్ లయన్’ పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక సమతుల్యతను సాధించిన వారెవరైనా ఉన్నారంటే అది పీవీయేనని ఆయన స్పష్టం చేశారు.
భారత హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ పీవీ నర్సింహారావుపై ఆయన త్వరితగతిన నిర్ణయాలు తీసుకోరనే అభాండం వేశారని, కానీ ఆయనంత వేగంగా నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మరొకరు లేరన్నారు. మాజీ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ పీవీ జీవితం రాజకీయవేత్తలకు ఓ సందేశం అన్నారు. సీబీఐ మాజీ డెరైక్టర్ విజయ రామారావు మాట్లాడుతూ అయోధ్య ఘటనలో పీవీ నర్సింహారావును నిందించడం సరికాదన్నారు. రచయిత వినయ్ సీతాపతి మాట్లాడుతూ భారతీయుల మదిలో చెరగని ముద్రవేసిన మహానుభావుడి గురించి ఈ పుస్తకం రాయడం తనకు గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.
పీవీని గుర్తించే సమయం ఆసన్నమైంది
పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల అమలుతో పాటు అణ్వాయుధ తయారీలో ఎంతో నిగూఢంగా వ్యవహరించారన్నారని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. మార్గరెట్ థాచర్, డెంగ్తో సమానంగా పీవీని గుర్తించే సమయం ఆసన్నమైందని కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన ఎమెస్కో విజయ్కుమార్ మాట్లాడుతూ పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల ఫలితమే నేటి భారతమన్నారు.
పెంగ్విన్ సీనియర్ ఎడిటర్ రజని మాట్లాడుతూ భారతీయ చరిత్రలో పీవీ స్థానాన్ని మననం చేసుకొనే సందర్భమిదేనన్నారు. . పీవీ ఆర్థిక సంస్కరణలను హర్షించలేని వారిలో తానూ ఒకరినని, అయినా చరిత్రలో పీవీ స్థానాన్ని చెరిపేయాలని ఎవరైనా అనుకుంటే అది సాధ్యం కాదని ఎడిటర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎమెస్కో ప్రధాన సంపాదకులు డాక్టర్ . చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన పనే అయినా రచయిత నిష్పాక్షికంగా, సమకాలీన ఆధారాలతో ఈ పుస్తకాన్ని మనకందించారన్నారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్, టంకశాల అశోక్, కె.బి.గోపాలంలకు ఎమెస్కో విజయ్ కుమార్ కృత జ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు తన తండ్రితో అనుభవాలను నెమరేసుకున్నారు.
నవీన భారత నిర్మాత పీవీ
Published Fri, Jul 1 2016 4:00 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండ్రోజులు వర్ష సూచన
యువత చేతుల్లోనే దేశ పాలన
సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ మంగళం
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
కొను‘గోల్’.. జాప్యం
● సెగ్మెంట్లలో ఓట్లు తగ్గితే ఇబ్బందులే.. ● కొత్త, పాత నాయకుల్లో కుదరని సఖ్యత ● కేడర్లో వర్గపోరు, అంతర్గత కుమ్ములాట ● ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీ ఎన్నికలు
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు
శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ క్యాంపు దోహదం
పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా
పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement