కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Published Sat, Jun 17 2017 2:19 AM

Raghunandan Rao on Miyapur land scandal

బీజేపీ నేత రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శనివారం జరగనున్న కేబినెట్‌ భేటీలో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ మూడేళ్లలో ఎక్కడా మియాపూర్‌ భూమి రిజిస్ట్రేషన్‌ కాలేదని, గజం భూమి కూడా అన్యాకాంతం కాలేదని శ్వేతపత్రం ఇవ్వాలన్నారు. సోమవారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామన్నారు.

Advertisement
Advertisement