ఆహా.. ఓహోలు ఆపండి: రఘువీరా | Sakshi
Sakshi News home page

ఆహా.. ఓహోలు ఆపండి: రఘువీరా

Published Tue, Jan 5 2016 3:02 AM

ఆహా.. ఓహోలు ఆపండి: రఘువీరా - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘తెలుగువారు గర్వించదగ్గ నేత వెంకయ్య నాయుడు అంటూ చంద్రబాబు, మోదీ-బాబు జోడీ అంటూ వెంకయ్య.. ఇలా నిత్యం ఒకరినొకరు పొగుడుకోవడం వారికి బాగుంటుందేమో.. ప్రజలకు ఎబ్బెట్టుగా ఉంది’ అని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఇందిర భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంకయ్య నాయుడు తన రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కోసమే చంద్రబాబును పొగుడుతున్నారని, తనపై ఉన్న కేసుల నుంచి బయటపడటానికి వెంకయ్య మధ్యవర్తిత్వంతో మోదీని ప్రసన్నం చేసుకునేందుకు బాబు పొగడ్తలను దినచర్యగా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement