ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు

Published Mon, Nov 9 2015 11:49 AM

railway gm sudden inspection in mmts

సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలులో ఆయన ప్రయాణించి, ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై జీఎంకు పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోదశ ఎంఎంటీఎస్ పనులు ప్రారంభమయ్యాయని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం ఇప్పటికే 817 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రక్షణ శాఖతో సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరించుకుని పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement