సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ కోటా తరహాలో ఆన్లైన్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ఉన్నత విద్యా శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని 30% మేనేజ్మెంట్ కోటా (ఇందులో 15% ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్) సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. మెరిట్ ప్రకారమే ఈ సీట్లను భర్తీ చేస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నా... డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు ఇస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కాలేజీలు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ ప్రకారం కేటాయించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే దరఖాస్తులను కాలేజీలు స్వీకరించినా ఆ లింకు ఉన్నత విద్యాశాఖకూ ఉంటుంది. కేటాయింపుల్ని కాలేజీలు కాకుం డా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో చేపడతారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. మరోవైపు ప్రభుత్వం సీజీజీ నేతృత్వంలో మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించినా... కోర్టు ఆదేశాల ప్రకారం ఆ కాలేజీకి నిర్ధారించిన ఫీజును చెల్లించే స్తోమత విద్యార్థికుందా లేదా అన్నది తెలుసుకునే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. దీన్ని సాకుగా చూపి డొనేషన్లు ఇవ్వని విద్యార్థులకు సీట్లు నిరాకరించే పరిస్థితి ఉంటుందని.. ఈ విషయంలో ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
22 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేనా?
కన్వీనర్ కోటాలోని 70% ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 22 నుంచి ప్రారంభించడం అనుమానమేనని అధికారులు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న జేఎన్టీయూహెచ్ నుంచి గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఉన్నత విద్యామండలికి అందాల్సి ఉంది. గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్టీయూ ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసింది. విజిలెన్స్ విభాగమూ కాలేజీల్లో తనిఖీలు చేస్తోంది. ఇవి ముగిసి నివేదికలు వస్తే.. వాటిని జేఎన్టీ యూ నివేదికలతో పోల్చి చూశాకే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు మరింత సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంటే ఈ నెల 22 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కావడం కష్టమేనని, జూలై తొలివారం నాటికి కౌన్సెలింగ్ను ప్రారంభిస్తామని చెబుతున్నారు.
ఆన్లైన్లో మేనేజ్మెంట్ కోటా భర్తీ!
Published Wed, Jun 8 2016 12:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement