బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్ | Sakshi
Sakshi News home page

బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్

Published Sat, Aug 13 2016 4:03 AM

బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్

భీమవరం టౌన్: ఏపీ సీఎం చంద్రబాబు పెంచిన నల్లతాచు గ్యాంగ్‌స్టర్ నయీమ్ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. నయీమ్ బతికున్నప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇప్పుడెందుకు నాట కాలు అంటూ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన  విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా కేబినెట్ మొత్తం గతంలో టీడీపీలోనే ఉండేవారని, పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించే రామలింగారెడ్డి ఆ వ్యాఖ్యలు చేసుంటారని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement