- వార్షికాదాయంలో ఎక్సైజ్శాఖ కొత్త రికార్డు
- నూరు శాతం ఆదాయ లక్ష్యంలో 99.53 శాతం నమోదు
- 238 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్, 334 లక్షల బీరు కేసుల విక్రయం
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాల్లో ఆబ్కారీశాఖ నూతన రికార్డు సృష్టించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి నూరు శాతం రెవెన్యూ వసూళ్ల లక్ష్యంలో ఏకంగా 99.53 శాతం టార్గెట్ను సాధించింది. రూ. 12,200 కోట్ల వార్షిక లక్ష్యానికిగాను నెలకు సుమారు రూ. 1,000 కోట్ల మద్యం అమ్మకాల డిమాండ్తో మార్చి 31 నాటికి రూ. 12,143 కోట్లు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 10,238 కోట్ల ఆదాయంకన్నా ఈసారి దాదాపు రూ. 2 వేల కోట్లు అదనంగా అందుకుంది.
కోట్ల కేసుల ఐఎంఎఫ్ఎల్, బీర్లు విక్రయం
రాష్ట్రంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్బీసీఎల్) ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయించే దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్), బీర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ ప్రాతిపదికగా తీసుకుంటా రు. 750 ఎంఎల్ మద్యంగల 12 సీసాలను ఒక కేస్(పెట్టె)గా విక్రయిస్తారు. ఈ లెక్కన 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి 31 వరకు రాష్ట్రంలో 238 లక్షల కే స్ల ఐఎంఎఫ్ఎల్ను విక్రయించారు. 2014-15లో 148 లక్షల కే స్ లను మాత్రమే విక్రయించగా ఈసారి ఏకంగా 90 లక్షల కేస్లు అదనం కావడం గమనార్హం. ఇక బీర్ల విక్రయాల్లో గత ఆర్థిక సంవత్సరం 282 లక్షల కేస్లను విక్రయించగా 2015-16లో ఏకంగా 334 లక్షల కేస్లు (52 లక్షల కేస్లు అదనం) విక్రయించారు. వీటితోపాటు లెసైన్స్ ఫీజులు, ఎక్సైజ్ డ్యూటీ తదితరాల ద్వారా సమకూరిన మొత్తం రూ. 12.143 కోట్లుగా ఓ అధికారి తెలిపారు.
వ్యాట్ బై ఎక్సైజ్ రూ. 8,160 కోట్లు
ఎక్సైజ్ శాఖ 12 నెలల కాలంలో మద్యం విక్రయాల ద్వారా రూ. 12 వేల కోట్లకుపైగా సమకూర్చుకున్నా పన్నులు, ఇతర ఖర్చులు పోగా ఎక్సైజ్ శాఖకు మిగిలింది మాత్రం సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే. మద్యం ద్వారా వచ్చిన రాబడిలో విలువ ఆధారిత పన్ను రూపంలో (వ్యాట్ బై ఎక్సైజ్) రూ. 8,160 కోట్లు (67 శాతం) వాణిజ్యపన్నుల శాఖకు చేరిపోగా సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్కు మరో రూ. 222 కోట్లు జమ అయింది. లెసైన్సు ఫీజు కింద రూ. 1,859 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.1,660 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ. 231 కోట్లు కలుపుకొని ఆబ్కారీ శాఖకు సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే మిగిలింది.
12 నెలల్లో రూ. 12,143 కోట్లు
Published Sun, Apr 3 2016 12:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement