♦ ఎనిమిది కేటగిరీల్లో అవార్డులకు విజేతల ఎంపిక
♦ త్వరలో ఎంపికైన విజేతలకు అవార్డుల ప్రదానం
♦ ఎంట్రీలకు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో అద్భుత సేవలందించిన ప్రతిభావంతులకు ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల విజేతల ఎంపిక సోమవారం ముగిసింది. సామాజిక సేవ, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం తదితర రంగాల్లో ‘సాక్షి ఎక్సలెన్స్-2015’ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించనున్న కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులకు ఈ ఏడాది కూడా అనూహ్య స్పందన లభించింది. ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందజేసిన వ్యక్తులు, సంస్థల నుంచి విజేతలను ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా కొనసాగింది. వివిధ రంగాల్లో అపార అనుభ వజ్ఞులైన ప్రముఖులు జ్యూరీగా వ్యవహరించారు. వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియ సోమవారం ఫైనల్కు చేరుకుంది.
ఎనిమిది కేటగిరీల్లో...
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కోసం ఎనిమిది కేటగిరీలను గుర్తించారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మింగ్(వ్యవసాయం), బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్, సోషల్ డెవలప్మెంట్(ఎన్జీవోస్), యంగ్ ఎచీవర్ ఇన్ ఎడ్యుకేషన్, యంగ్ ఎచీవర్ ఇన్ సోషల్ సర్వీస్ రంగాల్లో అవార్డులను అందజేసేందుకు ఎంట్రీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాక్షికి అందిన ఎంట్రీలను వివిధ స్థాయిల్లో న్యాయనిర్ణేతలు వడపోశారు. చివరకు సోమవారం విజేతలుగా నిలిచిన ఉత్తమ వ్యక్తులు, సంస్థల ఎంపిక పూర్తయ్యింది.
ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రామన్మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, మాజీ అడ్వొకేట్ జనరల్ ఏ సత్యప్రసాద్, కిమ్స్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.కృష్ణయ్య, సీనియర్ సంపాదకులు డాక్టర్ ఏబీకే ప్రసాద్, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ డీఎన్ రెడ్డి, ఎలికో ఫార్మా సీఎఫ్ఓ, మేనేజింగ్ డెరైక్టర్ వనితా దాట్ల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమైన జ్యూరీ విస్తృతంగా చర్చించిన అనంతరం తుది విజేతలను ఖరారు చేసింది.
తమకు అందిన ప్రతి ఎంట్రీని న్యాయనిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిదీ ఒకదానితో మరొకటి పోటీపడుతున్నట్లుగా ఉందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల జ్యూరీకి సభ్యులుగా వ్యవహరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి పాల్గొన్నారు.
‘సాక్షి’ ఎక్సలెన్స్ విజేతల ఎంపిక పూర్తి
Published Tue, Apr 5 2016 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement