- వెలగపూడి సచివాలయానికి రేపు మధ్యాహ్నం 2.59 గంటలకు ముహూర్తం
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్ ఎస్పీ టక్కర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం జూలై 21వ తేదీకల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి పూర్తిస్థాయిలో తరలివెళ్లనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సచివాయలంలోకి శాఖలు తరలివెళ్లడానికి బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ ముహూర్తానికి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలోని ఐదో బ్లాకు గ్రౌండ్ఫ్లోర్లోకి నాలుగు శాఖలు తరలివెళ్తాయి. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, కార్మికశాఖ, గృహనిర్మాణ శాఖలు ఐదో భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లోకి ప్రవేశించనున్నాయి. అలాగే జూలై 6న ఐదో భవనంలోని తొలి అంతస్తులోకి రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్ శాఖలు వెళ్తాయని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముహూర్త కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను ఉత్తర్వుల్లో సీఎస్ కోరారు.
జూలై 15, 21 తేదీల్లో మిగతా శాఖలు..
నిర్మాణంలో ఉన్న మిగతా నాలుగు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లలోకి జూలై 15న సాధారణ పరిపాలన, న్యాయ, ఇంధన-ఐఅండ్ఐ, పరి శ్రమలు, మున్సిపల్, ప్రభుత్వ రంగ, హోంశాఖల మంత్రులతోపాటు ఆయా శాఖలు, ఐటీ, కేంద్ర రికార్డుల రూమ్, రెవెన్యూ, పర్యావరణ, అటవీ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల మంత్రులు, ఆయా శాఖలు తరలివెళ్లనున్నాయి. జూలై 21న నాలుగు భవనాల్లోని తొలి అంతస్తుల్లోకి ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మిగతా శాఖలన్నీ ప్రవేశించనున్నాయి. ఒకటో భవనం తొలి అంతస్తులో ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం, సీఎస్, ఆయన కార్యాలయం వెళ్లనున్నాయి. అలాగే రెండు, మూడు, నాలుగు, ఐదో భవనాల్లోని అంతస్తుల్లోకి వివిధ శాఖల మంత్రులు, ఆయా శాఖలన్నీ తరలి వెళ్లనున్నాయి.
అమల్లోకి ఐదు రోజుల పనిదినాలు..
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లిన సచివాలయంతోపాటు, శాఖాధిపతుల ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు ఈనెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి తరలివెళ్లి నూనత రాజధాని ప్రాంతంలోను, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారానికి ఐదు రోజులు పనిదినాలు అమల్లోకి వస్తాయని, ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సీఎస్ పేర్కొన్నారు.
జూలై 21కి పూర్తిస్థాయిలో సచివాలయం
Published Tue, Jun 28 2016 12:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement