సెల్ఫీ పిచ్చి.. చెరువులోకి దిగి.. | Sakshi
Sakshi News home page

సెల్ఫీ పిచ్చి.. చెరువులోకి దిగి..

Published Mon, Mar 20 2017 9:20 PM

సెల్ఫీ పిచ్చి.. చెరువులోకి దిగి.. - Sakshi

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలకు క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలుసు. ఈ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్నా.. సెల్ఫీ పిచ్చిని వదిలించుకోలేకపోతున్నారు యువత. తాజాగా పఠాన్‌చెరువులో జరిగిన ఓ సంఘటనలో సెల్ఫీ పిచ్చితో ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

స్ధానిక ఇంద్రేశం చెరువు వద్ద సెల్ఫీ దిగడానికి ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు వెళ్లారు. నీళ్లల్లోకి దిగిన విద్యార్థులు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో జారి చెరువు లోపలికి పడి ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను వెలికితీసి టర్బో కాలేజికి చెందిన రాహుల్‌, శ్రీకర్‌రెడ్డిలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement