ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల బాధితుల వద్దకు వరంగల్ ఎంజీఎంకు చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రా పురం గ్రామాలకు చెందిన ఆరుగురు బాధితు లను పరీక్షించి, వారి ఒంటిపై ఉన్న గాయాలు, వాటి తీవ్రత తెలుసుకోవాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను రాతపూర్వకంగా నివేదిక రూపంలో నమోదు చేయాలని స్పష్టం చేసింది.
బాధితులకు మరింత మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే వెంటనే హైదరాబాద్ నిమ్స్కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్య దర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు, డాక్టర్ల నివేదిక తమ ముందుం చాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితులపై పోలీసులు జరిపిన దాడిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ ప్రారంభించింది.
లారీల వల్ల స్థానికులు చనిపోతున్నారు
తంగళ్లపల్లి వాగు నుంచి ఇసుక తీసుకుని నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం మీదుగా రాత్రీపగలు ప్రతీరోజూ 150–200 లారీలు వెళుతున్నాయని విచారణ సందర్భంగా రఘునాథ్ చెప్పారు. దీనివల్ల ఆ గ్రామాల్లో తీవ్ర వాయు కాలుష్యంతోపాటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మరణాలు కూడా చోటుచేసుకున్నాయని వివరించారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఈ మూడు గ్రామాల ప్రజలు అధికారులను కోరినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. పోలీసుల దెబ్బలకు బాధితుల అవయవాలు దెబ్బతిన్నాయని, వారికి తక్షణమే మెరుగైన వైద్యసాయం అందకుంటే శాశ్వతంగా ఆ అవయవాలు పనిచేయకుండా పోతాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఎంజీఎంలో చికిత్సనందిస్తాం: ఏజీ
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపి స్తూ.. గతనెల 13న పీయూసీఎల్ నిజ నిర్ధారణ కమిటీ సంబంధిత గ్రామాలకు వెళ్లిందని, పిటి షన్ మాత్రం ఇప్పుడు దాఖలు చేశారన్నారు. పిటిషనర్ ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారికి చికిత్సను అందజే స్తామన్నారు. అయితే అంతకన్నా ముందు ఇద్దరు ఎంజీఎం వైద్యులను బాధితులు చికిత్స పొందుతున్న మనోరమ ఆసుపత్రికి పంపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదే శించింది. ఈ సమయంలో రఘునాథ్ జోక్యం చేసుకుంటూ.. డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్ వైద్యులను పంపాలని కోరారు. ముందు బాధి తులకు చికిత్స అందించడానికి ప్రాధాన్యం ఇద్దామని, అవసరమైతే ఫోరెన్సిక్ డాక్టర్లను పంపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
నేరెళ్ల బాధితుల వద్దకు డాక్టర్లను పంపండి
Published Thu, Aug 10 2017 4:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement