పీవీ సింధుకు తెలంగాణ నజరానా | Sakshi
Sakshi News home page

పీవీ సింధుకు తెలంగాణ నజరానా

Published Mon, Jan 2 2017 6:19 PM

పీవీ సింధుకు తెలంగాణ నజరానా - Sakshi

హైదరాబాద్‌: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు గతంలో ప్రకటించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం నజరానా అందజేసింది. నగరంలోని షేక్‌పేట్‌లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది జరిగిన ఒలింపిక్స్లో తెలుగమ్మాయి పీవీ సింధు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిరస్మరణీయ విజయం తర్వాత సింధుకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని.. ఆమె చేస్తానంటే తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రియో నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే సింధును కేసీఆర్‌ సన్మానించి చెక్‌ అందజేశారు. ఇప్పుడు ఇంటి స్థలాన్ని కేటాయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement