ఎన్నో బాధలు పడ్డాం: నాయిని | Sakshi
Sakshi News home page

ఎన్నో బాధలు పడ్డాం: నాయిని

Published Mon, Apr 27 2015 11:47 PM

so many struggles are faced

అబిడ్స్: తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు ఉద్యమకారులను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుమ్మెరాత్‌బజార్‌లో అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్ వ్యాస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఉద్యమం, అమరవీరుల త్యాగఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందన్నారు. అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్‌వ్యాస్ మాట్లాడుతూ... గోషామహల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
 

Advertisement
Advertisement