- 'మట్టి సత్యాగ్రహం' పేరుతో ఏపీసీసీ వినూత్న నిరసన
- ప్రధానికి మట్టిని పార్సిల్ పీసీసీ చీఫ్ చేసిన రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీసీసీ ఆధ్వర్యంలో సరికొత్త నిరసన తెలిపారు. 'మట్టి సత్యాగ్రహం' పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శనివారం ఇందిరాభవన్లో లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు మహిళా సర్పంచ్లు తమ గ్రామాల నుంచి పంపిన మట్టిని ప్రధాని నరేంద్ర మోదీకి కొరియర్లో పంపారు.
ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, ముఖ్య నేతలు ఎన్.తులసిరెడ్డి, గంగాభవానీ, జంగా గౌతం, టి.జె.సుధాకర్బాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రఘువీరా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలనేది రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు అనీ దీనిని ప్రధానికి వినిపించాలనేది తమ అభిమతం అనీ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశారని అదే రీతిలో తామిపుడు మట్టి సత్యాగ్రహం చేపట్టామన్నారు. అనంతపురం జిల్లాలలోని గంగులమాయిపాళెం సర్పంచ్ వనమక్క, గోవిందాపురం సర్పంచ్ లక్ష్మీదేవమ్మ ఇద్దరూ తమ గ్రామాల్లో మట్టిని తనకు అంద జేస్తూ ప్రత్యేక హోదా కోరుతూ తాము రాసిన లేఖలను ప్రధానికి పంపాల్సిందిగా తనను కోరారని వారిచ్చిన స్ఫూర్తితో తామీ కార్యక్రమం చేపట్టామన్నారు.
ఇదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, అశోక్గజపతిరాజు సొంత గ్రామాలతో పాటుగా రాష్ట్రంలోని 22 వేల గ్రామాలు, 3వేల మున్సిపల్ వార్డుల నుంచి మట్టిని సేకరించి ప్రధానికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలనే అంశంపై చర్చించడానికి నవంబర్ 3వ తేదీన విజయవాడలో డీసీసీ అధ్యక్షుల, ముఖ్యనేతల విసృ్తత సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఒక కార్యాచరణను రూపొందించి గ్రామాల నుంచే కాదు, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల నుంచి కూడా మట్టిని సేకరిస్తామన్నారు. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదుల నుంచి నీటిని కూడా పంపిస్తామన్నారు.
మోదీకి మట్టి పార్సిల్..
Published Sat, Oct 24 2015 9:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement