కేసీఆర్పై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి

Published Thu, May 29 2014 2:47 PM

కేసీఆర్పై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి - Sakshi

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్పై టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్లో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ త్వరలో సీఎం అవుతున్నారు. ఈ సమయంలో కూడా బంద్కు పిలవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బంద్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం దారణమని ఆయన ఆరోపించారు. మీరే కాదు వివాదాలు మేము సృష్టించగలమని ఆయన టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఒక్కే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చావు తప్పి కన్ను లోట్టపోయిన చందంగా ఆ పార్టీ తయారైందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement