నేడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపునకు నోచుకోని కళాశాలలకు చెందిన విద్యార్థుల బదిలీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను బుధవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేయనుంది. 2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 కళాశాలల వరకు అనుబంధ గుర్తింపు దక్కలేదు. ఇప్పటికే ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర కళాశాలల్లోకి బదిలీ చేయాల్సి ఉంది.
దీనిపై మంగళవారం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ఇతర కళాశాలలకు వారిని బదిలీ చేయాలని అధికారులకు సూచిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కోర్టు తీర్పునకు లోబడి విధి విధానాలకు అనుగుణంగా బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు రంగం సిద్ధమైందని అధికారులు తెలిపారు.
త్వరలో ఇంజనీరింగ్ విద్యార్థుల బదిలీలు
Published Wed, Apr 20 2016 3:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement