పేకాట స్థావరంపై ఎస్‌వోటీ దాడి | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై ఎస్‌వోటీ దాడి

Published Wed, May 11 2016 5:05 PM

sot police arrested cards players in hyderabad

హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్ ఆదిత్య అపార్టుమెంట్‌లోని ఓ ప్లాట్‌పై ఎస్‌వోటీ పోలీసులు బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3,770తోపాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement