అచ్చెన్నాయుడు గారు పద్ధతిగా వెళ్లండి... | Sakshi
Sakshi News home page

అచ్చెన్నాయుడు గారు పద్ధతిగా వెళ్లండి...

Published Mon, Mar 14 2016 4:37 PM

అచ్చెన్నాయుడు గారు పద్ధతిగా వెళ్లండి... - Sakshi

హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పద్ధతిగా వెళ్లండంటూ సూచించారు. ' అచ్చెన్నాయుడు మీరు చెప్పేవాటిలో వాస్తవం ఉండవచ్చు. అయితే ఎక్స్ప్రెస్ చేసే విధానంలో పద్దతిగా వెళ్లండి' అని స్పీకర్ వ్యాఖ్యానించారు. అలాగే సభలో ఉన్న సభ్యులు మాట్లాడేటప్పుడు హుందాగా వ్యవహరించాలని స్పీకర్ సూచించారు. కాగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ రెచ్చిపోయారు. ఆయనపై మంత్రి నోరు పారేసుకున్నారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నేతపై ఎదురుదాడికి దిగారు.

సభాగౌరవాలను మరచిపోయి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. తమ మంత్రులు నారాయణ, పుల్లారావుపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ ఊరుకునేది లేదని, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో 7 కోట్ల అవినీతి అని మాట్లాడుతున్నారని, అయితే ఇప్పటివరకూ టెండర్లు వేయడం కానీ, అగ్రిమెంట్ కానీ కాలేదన్నారు. అలా జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అలాగే వైఎస్ జగన్ సిద్ధమా అని...చాలెంజ్ అంటూ అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. ఆరోపణలు గురించి అడిగితే సభ నుంచి పారిపోయారంటూ ...పై పెచ్చు తాను చేసిన చాలెంజ్ పై సమాధానం చెప్పాకే వైఎస్ జగన్ మాట్లాడాలని చెప్పడం గమనార్హం.

Advertisement
Advertisement