సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధి తరహాలోనే జిల్లా ఇన్చార్జి మంత్రులకూ ప్రత్యేక నిధి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున దీని కింద విడుదల చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ లెక్కన మొత్తం రూ.238 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి విడుదల చేసేందుకు సన్నద్ధమైంది. ఈ నిధులపై పెత్తనం మంత్రులకే ఉంటుంది.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలు, సిఫారసులను పరిగణనలోకి తీసుకొని వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్గా కేటాయించాలా.. లేదా నియోజకవర్గం ప్రాతిపదికగా ఇవ్వాలా... అనే అంశంపైనే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండ్రోజుల కిందట ఈ ఫైలును సీఎం కేసీఆర్కు పంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ రెండు ప్రతిపాదనలతో ప్రణాళిక విభాగం ఫైలు సిద్ధం చేసింది. నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇవ్వటం లేదా జిల్లాకు రూ.25 కోట్ల చొప్పున కేటాయించాలని అందులో ప్రస్తావించినట్లు తెలిసింది. నియోజకవర్గం యూనిట్గా తీసుకుంటే మొత్తం రూ.238 కోట్లు, జిల్లాను యూనిట్గా తీసుకుంటే రూ.250 కోట్లు అవసరమవుతాయని సీఎంకు నివేదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి పథకం (సీడీపీ) నిధులను ప్రభుత్వం ఇటీవలే రూ.3 కోట్లకు పెంచింది. వీటిపై ఇన్చార్జి మంత్రుల పెత్తనం తొలిగించిన ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రులకు ఈ నిధిని విడుదల చేయనుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఇన్చార్జి మంత్రులెవరూ లేరు.
కలెక్టర్లకు రూ.25 కోట్లు...
ప్రతి జిల్లా కలెక్టర్కు క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ (సీడీఎఫ్)లో కేటాయించే నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.10 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ఏడాది ఒకే విడతలో ఈ మొత్తం నిధులను విడుదల చేసింది. చాలా జిల్లాల్లో అవి ఖర్చు కానందున.. ఈ ఏడాది నాలుగు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా ప్రతి జిల్లాకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం రూ.25 కోట్లు నిధులను మంజూరు చేస్తూ ప్రణాళిక విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇన్చార్జి మంత్రులకు ప్రత్యేక నిధి
Published Thu, May 26 2016 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement