దీపావళికి పట్నాకు ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

దీపావళికి పట్నాకు ప్రత్యేక రైళ్లు

Published Sat, Sep 17 2016 6:48 PM

special trains for diwali to patna

హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి పట్నాకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు సికింద్రాబాద్-పట్నా (02793/02794) ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీల్లో ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 కి పట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2, 9, 16, 23, 30, నవంబర్ 6, 13 తేదీల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు పట్నా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement