అధికార పార్టీలోకి చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్
- ఖమ్మం జిల్లా మధిర నుంచి టీఆర్ఎస్లోకి వలసలు
- కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నేతలకు గులాబీ కండువాలు కప్పిన సీఎం
- అధికారిక నివాసంలో కార్యక్రమం... తుమ్మల, ఈటల హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వరాష్ట్రంగా ఒక ప్రత్యేక రాజకీయ సందర్భంలో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ ఆలోచనా సరళిని ప్రస్ఫుటం చేశాయని, టీఆర్ఎస్ బలోపేతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, కౌన్సిలర్లు శుక్రవారం సీఎం అధికారిక నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘మదిర నియోజకవర్గ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరడాన్ని రాజకీయంగా భావించడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా కలసి పోరాడదామని పిలుపునిచ్చాను. తెలంగాణను నిలబెట్టుకోవాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాలి. తెలంగాణ అంటే ఏందో దేశానికి అర్థం కావాలే. ఇప్పటికే మనం ఆ దిశగా ప్రయాణం సాగిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల నీటి అవసరాల కోసం మున్నేరు వాగుపై కనీసం చెక్డ్యాం కూడా కట్టుకోనీయకుండా కట్టడి చేసిన ఆంధ్రా పాలకులు... గోదావరి జలాలనూ వాడుకోనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి జలాలను అవసరమైతే కృష్ణా ఆయకట్టుకూ వాడుకునేలా సీతారామ ప్రాజెక్టు (దుమ్ముగూడెం) ఖమ్మానికి వరదాయినిగా నిలవనుందన్నారు. త్వరలో మధిర నియోజకవర్గ పర్యటనకు వస్తానన్నారు. చేరికల కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలు టీఆర్ఎస్ బలోపేతాన్ని కోరుకుంటున్నారు
Published Sat, Jun 4 2016 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement