ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని మృతి

Published Fri, Sep 15 2017 3:11 AM

Student who attempted suicide, died

- క్లాస్‌లీడర్‌ మందలించడంతో
- మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు


సాక్షి, లక్సెట్టిపేట/హైదరాబాద్‌ : క్లాస్‌ లీడర్‌ మందలించిందని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు గురువారం మృతిచెందారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చిట్టుమల్ల సాయినిధి(13), టేకుమట్ల శిరీష(13)లు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. సీనియర్‌ విద్యార్థులతో ఎందుకు కలసిమెలసి ఉంటున్నారని క్లాస్‌లీడర్‌ మందలించినందుకు మనస్తాపం చెందిన వీరు ఈ నెల 9న ల్యాబ్‌లో యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అక్కడి ఉపాధ్యాయులు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.

మరో మూడు రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోనున్న సాయినిధి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరణించింది. సీనియర్‌ విద్యార్థుల వేధింపులే తమ కుమార్తె మరణానికి కారణమని ఆమె తండ్రి ఆరోపిం చారు. ఓ విద్యార్థిని తనను వేధించినట్లు సాయినిధి చెప్పిందని తెలిపారు. ల్యాబ్‌కు తాళం వేసి ఉంటే తన కుమార్తె బతికేదని రోదించారు. ఏ రసాయనం తాగారనే విషయాన్ని కూడా ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు చెప్పడంలేదని వాపోయారు. మరో విద్యార్థిని టేకుమట్ల శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement