- క్లాస్లీడర్ మందలించడంతో
- మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు
సాక్షి, లక్సెట్టిపేట/హైదరాబాద్ : క్లాస్ లీడర్ మందలించిందని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు గురువారం మృతిచెందారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చిట్టుమల్ల సాయినిధి(13), టేకుమట్ల శిరీష(13)లు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. సీనియర్ విద్యార్థులతో ఎందుకు కలసిమెలసి ఉంటున్నారని క్లాస్లీడర్ మందలించినందుకు మనస్తాపం చెందిన వీరు ఈ నెల 9న ల్యాబ్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అక్కడి ఉపాధ్యాయులు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
మరో మూడు రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోనున్న సాయినిధి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరణించింది. సీనియర్ విద్యార్థుల వేధింపులే తమ కుమార్తె మరణానికి కారణమని ఆమె తండ్రి ఆరోపిం చారు. ఓ విద్యార్థిని తనను వేధించినట్లు సాయినిధి చెప్పిందని తెలిపారు. ల్యాబ్కు తాళం వేసి ఉంటే తన కుమార్తె బతికేదని రోదించారు. ఏ రసాయనం తాగారనే విషయాన్ని కూడా ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు చెప్పడంలేదని వాపోయారు. మరో విద్యార్థిని టేకుమట్ల శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని మృతి
Published Fri, Sep 15 2017 3:11 AM
# Tag
Related news
-
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ లాకప్లో ఉన్న నిందితుడు అనుజ్ థాపన్.. బుధవారం ఉదయం 11 గంటలకు లాకప్ గదిలో వాష్రూమ్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అధికారులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబ్కు చెందిన అనూజ్ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా గత నెల 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ అధికారులు.. నిందితులు, విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు ఆయుధాలు అందించిన అనుజ్ థాపన్, సుభాష్ చందర్లను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఒకడైన అనూజ్ తపన్ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.అయితే అనుజ్తోపాటు మరో పదిమంది అదే లాకప్లో ఉన్నారని, నలుగురు నుంచి అయిదుగురు పోలీసులు నిత్యం వీరిని గమనిస్తూ ఉంటారని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందనిప్పారులాకప్లో వ్యక్తి మరణిస్తే హత్య కేసుగా పరిగణిస్తారని, పోలీస్ స్టేషన్లోని పోలీసులందరినీ సీఐడీ ప్రశ్నిస్తుందని అని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ చెప్పారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఏ వస్తువు అందుబాటులో ఉండకుండా పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారని పేర్కొన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు లాకప్ వద్ద నిత్యం గస్తీ కాస్తుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా నలుగురు నిందితులు జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్లోని సూపర్ మార్కెట్కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం సుమిత్కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్ లాక్ చేసుకొని రూమ్లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్లో మెకానిక్గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ–ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్లోని నాగోల్ క్రాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఎం–ఫార్మసీ చదువుతోంది. తాను నాగజ్యోతిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలోనే సంజయ్ తెలియజేయగా వారు వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ మూడేళ్లుగా వారు ప్రేమలోనే ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో ఆమెను తండ్రి మందలించాడు. ఉగాది పండుగ తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాడు.కలిసి ఉండలేమని భావించి..తమ ప్రేమ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో, ఇకపై తాము కలిసి ఉండలేమని భావించి వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు.సూసైడ్ నోట్ లభ్యం..తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ భోజ్పురి నటి అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్లోని భాగల్పూర్లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్లో బంధువుల వివాహానికి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరిగింది. శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్పై ఓ నోట్ను పోస్ట్ చేసింది. అది పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగతజీవిలా కనిపించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు తాను డిప్రెషన్లో ఉన్నట్లు చెబుతున్నారు.అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే.. ఖేసరి లాల్ యాదవ్తో కలిసి 'దీవానాపన్' చిత్రంతో తొలిసారిగా నటించింది. ఈ భోజ్పురి చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు.
Related News by category
-
నామినేషన్ల దాఖలు ఇలా
సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో అతికించాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంది. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. శుభ ముహూర్తాలు ఇవే.. ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. జాతకాలతో ముందుకు... ● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్ వేసే చాన్స్ ఉంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ● నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు లోక్సభ స్థానం రిటర్నింగ్ సెంటర్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, లక్డీకాపూల్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు (సికింద్రాబాద్) మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు, రాజేంద్రనగర్ ● ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ● ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ● ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల ● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ● జూన్ 6న ఎన్నికల ప్రకియ ముగింపు చేవెళ్ల లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ 19 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ మాధవీలత 24 బీఆర్ఎస్ జి.శ్రీనివాస్యాదవ్ 22 ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 19సికింద్రాబాద్ లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ జి.కిషన్రెడ్డి ఏప్రిల్ 19 బీఆర్ఎస్ పద్మారావుగౌడ్ 19 కాంగ్రెస్ దానం నాగేందర్ 24 మల్కాజ్గిరి లోక్సభ స్థానం బీజేపీ ఈటల రాజేందర్ 18 బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి 22 కాంగ్రెస్ పట్నం సునీతారెడ్డి 22 కంటోన్మెంట్లోనూ... కంటోన్మెంట్: లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది. -
సీతారామం
భాగ్యనగరం..పురానాపూల్ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులుజై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ గంగాబౌలి, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి, ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో మంగళ్హాట్ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్ -
డోర్ నెంబర్లూ డొల్లే !
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్నెంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నెంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే కుటుంబం...పోలింగ్ కేంద్రాలెన్నో ! సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు. సాగర్లో ‘పంపింగ్’ ట్రయల్ రన్ షురూ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ కోసం జలమండలి ట్రయల్రన్ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పంప్హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్ కోసం జలాశయంలో జీరో పాయింట్ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ● నగర ఓటరు జాబితాలో వింతలెన్నో ● రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో అయోమయ పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు హైదరాబాద్ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు మరణించిన వారు47,141చిరునామా మారిన వారు4,39,801డూప్లికేట్లు54,2595,41,201మొత్తం -
28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ గచ్చిబౌలి: మత్తుకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎండీఎంఏ డ్రగ్తో పట్టుబడి కటకటాలపాలయ్యారు. మాదాపూర్ ఎస్ఓటీ, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేసి ఇద్దరు స్నేహితులు ఏపీలోని రాజమండ్రి పట్టణం పాతపేటకు చెందిన కాటూరీ సూర్య కుమార్ (22), బాలాజీపేటకు చెందిన గుత్తుల శ్యామ్ బాబు (22)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2023లో డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చినా అతను తీరు మారలేదు. రైల్వేలో సీనియర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు సూర్య కుమార్ బెంగళూర్లోని జైన్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూర్లో తన స్నేహితుడైన అభి ద్వారా డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సాల్మన్ పరిచయమయ్యాడు. డ్రగ్స్కు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ పెడ్లర్గా మారాడు. అంతే కాకుండా తన స్నేహితుడైన శ్యామ్ బాబుకు మత్తు అలవాటు చేశాడు. ఈ నెల 14న బెంగళూర్ వెళ్లిన సూర్య కుమార్ గాడ్ ఆఫ్ సాల్మన్ వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. 16న తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు గ్రాములు ఇద్దరు స్నేహితులు సేవించారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్ర యించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్లోని చందానాయక్ తండాలోని రాజా రెసిడెన్సీ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఎండీఎంఏ సరఫరా చేసిన గాడ్ ఆఫ్ సాల్మన్ పరారీలో ఉన్నాడు. 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో గ్రాము ఎండీఎంఏను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోదా ఉన్నా.. నిఘా సున్నా!
టాస్క్ఫోర్స్ కార్యాలయంసాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్ల కోసం దేశ వ్యాప్తంగా వేట.. నకిలీ కరెన్సీ కేసుల్లో సరిహద్దుల ఆవలి వరకు ప్రయాణం.. ఉగ్రవాద కేసుల్లో ఫీల్డ్ ఆపరేషన్లు.. కేవలం ఇవేనా..? నగర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాత్మక నేరం చోటు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చిన పేరు హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ విభాగం ప్రతిష్ట ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాస్పద అంశాలతో మసకబారుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు, ఎన్నికల డబ్బు రవాణా, వ్యాపారుల కిడ్నాప్–బెదిరింపులు.. ఇలా అనేక వివాదాలు ఈ విభాగాన్ని చుట్టుముడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల నెలకొనడానికి నగరంలోని రెండు టాస్క్ఫోర్స్ కార్యాలయాల్లో సరైన నిఘా లేకపోవడమూ ఓ కారణంగా నిలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. కస్టోడియల్ మరణాలకు చెక్ చెప్పడం, మానవహక్కుల ఉల్లంఘనలు లేకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచడం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలీసింగ్లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్పీం కోర్టు దాదాపు పదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. డీకే బసు వర్సస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో తీర్పు ఇస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పలుమార్లు గడువు పెంచిన పోయిన సుప్రీం కోర్టు 2020 డిసెంబర్ను తుది గడువుగా నిర్దేశించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పని చేస్తున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్లోనూ కనిష్టంగా 11 కెమెరాలు ఏర్పాటయ్యాయి. కేవలం పోలీసుస్టేషన్లో మాత్రమే కాదు.. ఠాణా హోదా ఉన్న సీసీఎస్, సైబర్ క్రైమ్ పీఎస్ల్లోనూ ఇవి ఉన్నాయి. 28 ఏళ్ల క్రితమే పోలీసుస్టేషన్ హోదా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అధీనంలో పని చేసే కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కేవలం యాంటీ గూండా స్క్వాడ్ మాదిరిగా కేవలం ఆపరేషనల్ విభాగంగా ఉండేది. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోస్టులు పొండటంలో, జీతభత్యాల విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో 1996లో అప్పటి పోలీసు శాఖ ప్రభుత్వానికి కీలక నివేదిక పంపింది. దీని ఆధారంగా సర్కారు కమిషనర్స్ టాస్క్ఫోర్స్కు సైతం పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా దీనికి వస్తున్నాయి. ఇలా దాదాపు 28 ఏళ్లుగా ఠాణా హోదా ఉన్న టాస్క్ఫోర్స్ కార్యాలయాలు (సికింద్రాబాద్లో ఒకటి, పాతబస్తీలో మరోటి) సీసీ కెమెరాలు లేకుండానే కాలం గడిపేస్తున్నాయి. అన్నింటిలోనూ ఏర్పాటు చేయకుండా ప్రతి పోలీసుస్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.హైదరాబాద్ టాస్క్ఫోర్స్కు పోలీసుస్టేషన్ హోదా 1996లోనే జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వం ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం ఠాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏర్పాటు చేయని అధికారులు ఫిర్యాదు చేసే విధానానికీ స్వస్తి.. టాస్క్ఫోర్స్ విభాగం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తే దానిపై పని భారం పెరిగి, ఫలితాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. దీన్ని అంగీకరించినప్పటికీ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది మాత్రం అంతు చిక్కట్లేదు. మరోపక్క టాస్క్ఫోర్స్ విభాగం పట్టుకునే నేరగాళ్లపై నమోదయ్యే వాటిలో అత్యధికం సుమోటో కేసులే. అంటే.. పోలీసులే ఫిర్యాదుదారుడిగా ఉంటారు. ఓ నేరగాడిపై సమాచారం అందుకుని, వలపన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారే సంబంధిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తుండేవారు. దీనివల్ల భవిష్యత్తులో సాక్ష్యం చెప్పడం వంటివి తప్పనిసరి కావడంతో ఈ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం ఉండేది. 2015 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు కావట్లేదు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఆయా ఠాణాల అధికారులే ఫిర్యాదు చేస్తూ సుమోటో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కారణాలే టాస్క్ఫోర్స్ అభాసుపాలు కావడానికి మూలం అనే వాదన బలంగా వినిపిస్తోంది.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్తో 'సలార్' బైక్ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
Photos
View allVideo
View allతప్పక చదవండి
- అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement