కాపురానికి వెళ్లటం ఇష్టం లేక... | Sakshi
Sakshi News home page

కాపురానికి వెళ్లటం ఇష్టం లేక...

Published Wed, Mar 2 2016 9:55 PM

Suicide attempt in swathi

అంబర్‌పేట: భర్తతో తిరిగి ఎక్కడ కాపురానికి పంపిస్తారోనని ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది. ఈ సంఘటన బుధవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుసుధన్ కథనం ప్రకారం డీడీ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసే లింగయ్య కుమార్తె స్వాతి(22) వివాహం నాలుగేళ్ల క్రితం నల్లగొండ జిల్లా లింగోటం గ్రామానికి చెందిన పరమేష్‌తో జరిగింది.

ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో స్వాతి కొన్ని రోజులుగా పుట్టింట్లోనే ఉంటోంది. విడాకుల కోసం కోర్టుకు కూడా వెళ్లారు. బుధవారం కోర్టు వద్ద కౌన్సెలింగ్ జరగడంతో రాజీ పడతామని పెద్దలతో మాట్లాడుకుంటామని ఇరువైపుల వారు ఉస్మానియా యునివర్సిటీకి వచ్చారు. ఇద్దరినీ హైదరాబాద్‌లో వేరు కాపురం పెట్టించేందుకు పెద్దల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, తిరిగి కాపురం చేయడం ఇష్టం లేనిస్వాతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది.

Advertisement
Advertisement