స్వచ్ఛ ఛాంపియన్‌గా సికింద్రాబాద్ స్టేషన్ | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ ఛాంపియన్‌గా సికింద్రాబాద్ స్టేషన్

Published Sun, Jun 7 2015 1:41 AM

స్వచ్ఛ ఛాంపియన్‌గా సికింద్రాబాద్ స్టేషన్

హైదరాబాద్: స్వచ్ఛ ఛాంపియన్‌గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు గుర్తింపు లభించింది. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత రంగంపై ‘క్లీన్ ఇండియా-2015’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సుకుకి ఎక్స్‌నోరా అనే స్వచ్చంద సంస్థ ఈ సర్టిఫికెట్‌ను అందజేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ చీఫ్ సెక్రటరీ కృష్ణారావు, స్వచ్ఛ భారత్ అంబాసిడర్ అమల అక్కినేని, తెలంగాణ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ తదితరుల చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement