సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరడం తప్పా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. మల్లన్నసాగర్లో రైతులకు జరుగుతున్న నష్టానికి ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలుపుతున్నాయని, దీనికే టీడీపీతో కలసిపోయినట్టుగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీతో టీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన ఆరోపించారు.
చట్టం అమలు చేయమనడం తప్పా: జీవన్
Published Wed, Sep 14 2016 2:04 AM
Related news
-
ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్రెడ్డి ఈ సెగ్మెంట్ పరిధిలో ఆది లాబాద్, ఆసిఫాబాద్లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్తో పాటు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..సీఎం రేవంత్రెడ్డి ఆసిఫాబాద్ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్ ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంఐఎం నేతను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
‘ముందు రాయ్బరేలీ నుంచి గెలవండి’
లోక్సభ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన రాయ్బరేలీ, అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీలో కిషోర్ లాల్ శర్మను బరిలోకి దించింది. రాహుల్ గాంధీ తాను మూడు సార్లు గెలిచిన అమెథీని వదిలి రాయ్బరేలీ బరిలో దిగటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలే కాకుండా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం రాహుల్గాంధీపై విమర్శలు చేశాడు. ‘గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథ్ ఆనంద్ వంటి చెస్ ఆటగాళ్లు.. త్వరగా రిటైర్ అవటం మంచిదైంది. వారు.. ఒక చెస్ మెథావిని ఎదుర్కొవల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్కు.. ‘అగ్రస్థానం కోసం సవాల్ చేసే ముందు ముందు రాయ్బరేలీ నుంచి గెలివాలి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి గ్యారీ కాస్పరోవ్ సెటైర్ వేశారు.Traditional dictates that you should first win from Raebareli before challenging for the top! 😂— Garry Kasparov (@Kasparov63) May 3, 2024మరోవైపు.. నటుడు రన్వీర్ షోరే స్పందిస్తూ.. ఈ పరిణామాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారని రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోతో గ్యారీ కాస్పరోవ్ను ట్యాగ్ చేశారు. ‘భారత రాజకీయాల్లో నా చిన్న జోక్ ప్రభావితం చేయదని ఆశిస్తున్నా. అయితే నాకు నచ్చిన చెస్ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు (రాహల్ గాంధీ) ఆడటం చూడకుండా ఉండలేను!’ అని గ్యారీ కాస్పరోవ్ అన్నారు.Nice one, @Kasparov63, but can you handle this move? https://t.co/xrWFf3zLK9 pic.twitter.com/quuw4JGB43— Ranvir Shorey (@RanvirShorey) May 3, 2024రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పోటీ చేయటంపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయటంపై చాలా మందికి పలు అభిప్రాయాలు ఉంటాయి. అయితే అందరూ.. రాహుల్ గాంధీకి రాజకియాలతో పాటు చెస్ ఆట మీద చాలా పట్టుందని మర్చిపోవద్దు’ అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో ఆయన ట్వీట్పై బీజేపీ నేతలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.Many people have many opinions on the news of @RahulGandhi contesting elections from Rae Bareli.Remember, he is an experienced player of politics and chess. The party leadership takes its decisions after much discussion, and as part of a larger strategy. This single decision…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 3, 2024చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ విధానాలను కాస్పరోవ్ వ్యతిరేకించడం వల్లే అధికారులు ఆయన్ను ఉగ్రవాదులు, తీవ్రవాదులు జాబితాలోకి చేర్చారు. చెస్లో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చాలా కాలంగా పుతిన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. -
తాతా.. నీకు టాటా..
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో వీడియో విడుదల చేసింది. విభజన చట్టాల అమల్లో వైఫల్యం, వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నిర్లక్ష్యం, 2020లో హైదరాబా ద్లో వచ్చిన భారీ వరదలకు కేంద్రం ఎలాంటి సాయం చేయకపోవడం, ఐటీఐఆర్ లాంటి అనేక అంశాల్లో తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాలను వీడియోలో పేర్కొంది. ‘పదేళ్ల తెలంగాణకు ద్రోహం చేసింది చాలు.. తాతా.. నీకు టాటా’ అంటూ రూపొందించిన వీడియోను శుక్రవారం విడుదల చేసింది. -
అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్షా డీప్ఫేక్ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్ వీడియోను మొదట పోస్ట్ చేసినది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ‘ఎక్స్’ నుంచి మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు.ల్యాండ్ లైన్ ఐపీ అడ్రస్ నుంచి..గత నెల 23న మెదక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ మాట్లాడినట్టు ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఎక్స్, ఫేస్బుక్ ఖాతాల్లో అది వైరల్గా అయి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీశ్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ చేశారు.మరోవైపు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్ చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ఫేస్బుక్లను స్పెషల్ సెల్ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ‘ఎక్స్’ సంస్థ.. తొలుత ఆ వీడియో పోస్ట్ అయినది తెలంగాణ నుంచేనని వెల్లడించింది. ఒక ల్యాండ్లైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్టుగా పేర్కొంది. అయితే ఎవరు చేశారనేది ఇంకా వెల్లడించలేదు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మళ్లీ ‘ఎక్స్’కు లేఖ రాశారు. కచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది? ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు? ఎవరెవరు షేర్ చేశారు? కామెంట్లు/లైకులు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. ‘ఎక్స్’ సంస్థ ఒకట్రెండు రోజుల్లో సమగ్ర నివేదిక అందించే అవకాశం ఉంది.
Related News by category
-
గోపాలపురం నియోజకవర్గంలో మండలాలు
గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల జనాభా : 2,99,710 పురుషులు : 1,49,556 సీ్త్రలు : 1,50,154 ఓటర్లు : 2,41,798 పురుషులు : 1,18,783 సీ్త్రలు : 1,23,008 ఇతరులు : 07 పోలింగ్ కేంద్రాలు : 248 పంచాయతీలు : 80 గ్రామాలు : 142 -
1,577 పోలింగ్ కేంద్రాల్లో
వెబ్ కాస్టింగ్● మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు ● జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎన్నికల కమి షన్ మార్గదర్శకాలకు అనుగుణంగా 1,577 పో లింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేశా మని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు కె.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.మాధవీలత, జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఆరుగురు ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, జిల్లాకు అదనపు పోలీ సు బలగాలను కేటాయించాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహించామని, ఈవీఎం కమిషనింగ్కు ఏర్పాట్లు చేశారని తెలిపారు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికల పరిశీలకుడు కమల్ కాంత్ సరోఛ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి మైక్రో అబ్జర్వ ర్లను నియమించామని తెలిపారు. పోలీసు పరిశీలకులు బలరాం మీనా మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్కు, స్ట్రాంగ్ రూముల వద్ద, ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూము ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేలా కార్యాచరణ రూపొందించామని వివరించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు జై అరవింద్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనలు, ఖర్చుల వివరాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించామన్నారు. 6, 8 తేదీల్లో రెండో విడత శిక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నియోజకవర్గాల వారీగా పీఓ, ఏపీఓలకు తొలి విడత శిక్షణ పూర్తయ్యిందన్నారు. పోలింగ్ సిబ్బందికి ఈ నెల 6, 8 తేదీల్లో రెండో విడత శిక్షణ, పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 2న నిర్వహించిన హోం ఓటింగ్లో 1,306 మందికి గాను 1,268 ఓటు వేశారని తెలిపారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, అనుబంధ శాఖలతో కలిసి జిల్లాలో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. -
పారిశ్రామిక నవోదయం
ఇంకా... ● కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి గ్రామం వద్ద మరో భారీ పరిశ్రమకు నాంది పలికారు. 26.65 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1,350 కోట్ల పెట్టుబడితో త్రివేణి రెన్యువబుల్స్ సంస్థ ఆధ్వర్యాన సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2,400 మందికి ఉద్యోగాలు లభించాయి. ● నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో 14 ఎకరాల్లో జాగృతి బయోటెక్ సంస్థ ఆధ్వర్యాన బయో టెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. రూ.50 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ పరిశ్రమ ఏర్పాటు పూర్తయితే 81 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ● పెరవలి మండలం ఖండవల్లి గ్రామం వద్ద రవళి స్పిన్నర్స్ సంస్థ 16,800 స్పిండిల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో కాటన్ స్పిన్నింగ్ మిల్లును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసింది. అనంరతం 1,520 స్పిండిల్స్గా, 2,900 డ్రమ్స్కు దీనిని విస్తరించింది. సంస్థలో 1,000 మంది ఉపాధి పొందేవారు. నెలకు 10,000 టన్నుల నూలు ఈ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అవుతోంది. సాధారణమైన నూలుతో పాటు జీన్స్కు, అన్ని రకాల వస్త్రాల తయారీకి ఉపయోగపడే నూలు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ‘రవళి’ దారం మంచి పేరు పొందింది. దీని ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. తద్వారా రూ.150 కోట్ల పెట్టుబడి వ్యయంతో 2 లక్షల స్పిండిల్స్ తయారీ సామర్థ్యానికి దీనిని విస్తరించారు. ఫలితంగా మరో 1,000 మందికి ఉపాధి లభించింది. ● జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోని ఆంధ్రా పేపర్ మిల్లు ఉత్పత్తి సామ ర్థ్యం పెరిగింది. రూ.2 వేల కోట్లతో మరో 2,300 మందికి ఉద్యోగాలు లభించాయి.ఇసుకపట్ల పంగిడి వద్ద సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ సాక్షి, రాజమహేంద్రవరం: నవ్య తూర్పు గోదావరి జిల్లా సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం గడచిన ఐదేళ్లుగా కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రోత్సాహం ఇచ్చింది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సింగిల్విండో విధానంలో అన్ని రకాల అనుమతులూ ఇస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీపై భూములు కేటాయిస్తూండటం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పారిశ్రామిక దిగ్గుజాలు, బహుళజాతి సంస్థలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటితో పాటు సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) ఏర్పాటుకు అత్యధిక శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. అధికార యంత్రాంగం చొరవతో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు కేంద్రంగా జిల్లా మారింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ప్రభుత్వ అజెండాతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దక్కుతోంది. పరిశ్రమల స్థాపన.. ఉద్యోగాల కల్పన కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం నూతన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో భారీ పరిశ్రమ స్థాపనకు అడుగులు పడ్డాయి. పారిశ్రామిక దిగ్గజ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ తొలి దశలో రూ.1,000 కోట్లు, రెండో దశలో మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడితో గ్రాసిమ్ కాస్టిక్ సోడా ప్లాంట్ నిర్మించింది. ఈ పరిశ్రమ రెండో దశ విస్తరణ ప్రక్రియ సైతం ఇటీవల పూర్తయింది. 2,500 మందికి ఉపాధి దక్కుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన ఈ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ పట్టాలెక్కించారు. రూ.260 కోట్లతో ఇథనాల్ ప్రాజెక్టు ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన గోదావరి తీరాన.. పెట్రో ఉత్పత్తుల్లో కలిపేందుకు ఉపయోగించే బియ్యం ఆధారిత తొలి ఇథనాల్ ప్లాంట్ మన జిల్లాలో ఏర్పాటవుతోంది. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో రూ.260 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏపీఐఐసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.50 కోట్ల విలువైన 20.07 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల (2 లక్షల లీటర్ల) ఇథనాల్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం దీని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పరిశ్రమ నిర్మాణం పూర్తయితే 210 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుంది. ఎంఎస్ఎంఈలతో.. గడచిన మూడున్నరేళ్లుగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి, తద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అధికార యంత్రాంగం గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 6,000 ఎంఎస్ఎంఈలు స్థాపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 2,427 ఏర్పాటు చేసింది. చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలకు కలిపి రూ.39.557 లక్షల పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా 10,179 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తీసుకుని వచ్చిన సింగిల్ విండో విధానం పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగపడుతోంది. 2019–23 మధ్య వివిధ పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామిక అవసరాలకు 2,514 దరఖాస్తులు అందగా.. వాటిలో 2,431కు పరిష్కారం చూపారు. జిల్లాలో పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం బలభద్రపురంలో రూ.2,500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా ఇండస్ట్రీ గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్రాజెక్టు 2,427 ఎంఎస్ఎంఈల పరిధిలో 10,179 మందికి ఉపాధి జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సంవత్సరం పరిశ్రమల స్థాయి స్థాపించిన యూనిట్లు పెట్టుబడి ఉద్యోగాల కల్పన 2019–23 భారీ 1 రూ.861 కోట్లు 1,203 2024 భారీ 4 రూ.3,760 కోట్లు 5,910 ఎంఎస్ఎంఈలు 2019–22 533 రూ.245.25 కోట్లు 5,725 2022 ఏప్రిల్ – 2023 సెప్టెంబర్ 8,885 రూ.777.28 కోట్లు 19,050 -
నేతన్న కుటుంబంలో వెలుగులు
తుని: కోటనందూరు మండలం బంగారయ్యపేటకు చెందిన పసగడుగుల అప్పారావుది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కులవృత్తి చేనేత మగ్గం పనిలో వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగించేవాడు. అలాంటి అప్పారావు కుటుంబంలో సీఎం జగన్ ప్రభుత్వం అండతో అనూహ్య మార్పులొచ్చాయి. ఆ నిరుపేద కుటుంబం కష్టాలను జయించి ప్రస్తుతం సంతోషంగా జీవిస్తోంది. కాగా నేత కార్మికుడు అప్పారావుకు ముగ్గురు కుమారులు. జగనన్న ప్రభుత్వం వచ్చాక అప్పారావుకు పెన్షన్ కానుకతో పాటు పెద్దకుమారుడికి రైతుభరోసా, రెండో కుమారుడికి నేతన్న నేస్తం, చిన్న కుమారుడికి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. గత నాలుగున్నరేళ్లలో అప్పారావు పెన్షన్ కానుక ద్వారా రూ.లక్ష, పెద్ద కుమారుడికి రైతు భరోసా పథకంలో రూ. 54 వేలు, రెండో కుమారుడు పసగడుగుల త్రిమూర్తులకు నేతన్న నేస్తం ద్వారా సంవత్సరానికి రూ.24 వేలు చొప్పున 96 వేలు అందింది. రెండో కుమారుడు త్రిమూర్తులు భార్య సత్యగౌరికి జగనన్న చేదోడు రూపంలో రూ.40 వేలు, అమ్మవడి పథకం ద్వారా రూ.75 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని పొందారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదు సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాల కోసం రాజకీయ నాయ కుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. ఎవరి ప్ర మేయం లేకుండానే మాకు అన్ని పథకాలు అందు తున్నాయి. గ్రామ వలంటీర్ నేరుగా ఇంటికొచ్చి అర్హత ఉన్న పథకాలు నమోదు చేశాడు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదు. ఇబ్బందుల్లో ఉన్న మాలాంటి పేదలను ఆదుకున్న దేవుడు సీఎం జగన్మోహన్రెడ్డి. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. –సత్యగౌరీ, గృహిణి, బంగారయ్యపేట, కోటనందూరు మండలం ఆపద్భాందవుడు సీఎం జగన్ గతంలో ఎన్నో ఇబ్బందులు పడే మా కుటుంబం జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత సజావుగా సాగుతోంది. మా ఇంట్లో అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నాకు ఏటా అందే నేతన్న నేస్తం మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తోంది. నా భార్యకు చేదోడు, అమ్మ ఒడి, తండ్రికి పెన్షన్ కానుక, అన్నయ్యకు రైతు భరోసా పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే మా కుటుంబం ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడేది. –పసగడుగుల త్రిమూర్తులు, నేతన్న నేస్తం లబ్ధిదారు, బంగారయ్యపేట, కోటనందూరు మండలం సచివాలయంలో ఉద్యోగం సామన్య కుటుంబంలో పుట్టిన నేను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ఉన్నత చదువులు చదివాను. 2021–13 లో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫ్కేషన్ ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో పోటీ పరీక్ష రాయగా వేల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. –పసగడుగుల శివ గణేష్, సచివాలయ ఉద్యోగి, కోటనందూరు మండలం చేనేత కార్మికుడు అప్పారావు కుటుంబానికి రూ.3.65 లక్షల లబ్ధి నిరుపేద కుటుంబానికి అండగా సీఎం జగన్ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు -
సర్వేజనా సుఖినో ‘భవంతి’
ఉప్పలగుప్తం: అన్ని సేవలూ అందుబాటులోకి వస్తే.. ఏ పనైనా సకాలంలో పూర్తయితే.. ఇంకేం కావాలి. రైతులు, ప్రజలు, అన్ని వర్గాలకూ ఒకేచోట నుంచి సేవలు అందితే, ఆ సేవా కేంద్రాలూ చూడముచ్చటగా కనిపిస్తే ఆ ఊరే మారుతోంది. ప్రగతి చాటుతోంది. అచ్చం అలానే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధి సూదాపాలెంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఒకేచోట ముచ్చట గొలుపుతున్నాయి. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఒకేచోటకు రావటంతో ఈ పల్లె ప్రగతి చాటుతోంది. ప్రతి రెండు వేల మంది జనాభాకు చేరువగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలనే దృక్పథంతో ఈ భవనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. రూ.43.60 లక్షలతో సచివాలయ భవనం, రూ.23.94 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.20. 80 లక్షలతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను నిర్మించారు. ఇద్దరు జమీందార్లను ఓడించిన పిన్నమనేని కొవ్వూరు తొలి ఎమ్మెల్యే రికార్డు కొవ్వూరు: కొవ్వూరు మొట్టమొదటి ఎమ్మెల్యేగా సీపీఐ అభ్యర్థి పిన్నమనేని రామచంద్రరావు గెలుపొందారు. 1952 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అన్నదేవరపేట జమీందారు అల్లూరి బాపినీడు, ప్రజాపార్టీ అభ్యర్థిగా దొమ్మేరు జమీందారు పెండ్యాల వెంకట కృష్ణ రంగారావు(మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు తండ్రి)తో పిన్నమనేని రామచంద్రరావు పోటీ పడ్డారు. ఇద్దరు ఉద్దండులైన జమీందార్లతో తల పడిన ఆయన ఆ ఎన్నికల్లో 6,681 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇద్దరు జమీందార్లను ఓడించిన వ్యక్తిగా పిన్నమనేని కొవ్వూరు ఎన్నికల చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన నాయకుడిగా ఆయన ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. బూత్ క్యాప్చరింగ్ అంటే.. రాయవరం: ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడం, పోలింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించడాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. ఎవరైనా కావాలని బ్యాలెట్ పేపరు గానీ, ఈవీఎంలను గానీ పాడు చేయడం, విరగ్గొట్టడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం వంటి చర్యలకు పాల్పడటం ఇందులో భాగంగా ఉంటాయి. పోలింగ్ కేంద్రంలో ఓటర్లను భయపెట్టడం, పోలింగ్ను అడ్డుకోవడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే ప్రభుత్వ సిబ్బంది అయితే ఐపీసీ 1951 సెక్షన్ 135ఎ, 136 ప్రకారం మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇతరులైతే ఒకటి నుంచి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. 05కెవీఆర్01:
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
Photos
View allVideo
View allతప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement