బంజారాహిల్స్, న్యూస్లైన్: భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు.. అంతేకాకుండా స్టేషన్నుంచి బయటకు పొమ్మని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన బాధితురాలు పోలీసుస్టేషన్ సమీపంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే మామిడి ఆశ (28) శ్రీనివాస్ను 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో కొన్నేళ్ల పాటు వేరుగా కాపుం సాగించారు.
అయితే, దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఈ క్రమంలో ఆశ తన మేనమామ శ్రీనివాస్ను రెండో పెళ్లి చేసుకొని కూకట్పల్లిలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. అయి తే, భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉం టున్నారు. దీంతో ఆశ గౌరీశంకర్కాలనీలో ఉంటున్న మొదటి భర్త వద్దకు వచ్చారు. కాగా, ఆయన అప్పటికే ఓ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న హేమలతను పెళ్లి చేసుకున్నాడు. అయితే, తనను కూడా ఇంట్లో ఉండనివ్వాలని ఆమె వారితో గొడవ పడింది. దీనిపై కొంతకాలంగా ముగ్గురి మధ్య ఘర్షణ జరుగుతోంది.
బుధవారం ఉదయం హోటల్కు వెళ్లిన ఆశ.. తన భర్తను వదిలిపెట్టాలంటూ హే మలతను హెచ్చరించింది. ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగి, కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో హేమలతకు తీవ్ర గాయాలు కాగా, భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, హేమలత, శ్రీనివాస్లపై ఫిర్యాదు చేసేందు కు మధ్యాహ్నం సమయంలో ఆశ బంజారాహిల్స్ ఠాణాకు చేరుకున్నారు. ఎస్సై ఆమె ఫిర్యాదు తీసుకోకపోగా, బయటకు వెళ్లమంటూ గదమాయించారు. ఇప్పటికే మూడుసార్లు వచ్చినా ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆమె నిలదీయగా, పోలీసులు ఆమెను బయటకు గెంటేశారు. మనస్తాపానికి గురైన ఆమె ఠాణా సమీపంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పం టించుకొంది.
తీవ్రంగా గాయపడిన ఆమెను 108లో ఉస్మానియాకు తరలించారు. పోలీ సుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు బాధితురాలు మీడియాకు తెలిపింది. ప్రస్తుతం ఆమె పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, ముందు ఆసుపత్రికి తరలించి తర్వాత ఫిర్యాదు తీసుకుంటామని బాధితురాలు ఆశకు చెప్పామని, అంతలోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం
Published Thu, Sep 5 2013 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement